భారత్లో వెనక్కి తగ్గిన ఫైజర్!
తాము తయారుచేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ భారత్లో చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ వెల్లడించింది......
దిల్లీ: తాము తయారుచేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ భారత్లో చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ వెల్లడించింది. భారత్లో కరోనా టీకా వినియోగానికి దరఖాస్తు చేసుకున్న తొలి సంస్థ ఫైజరే కావడం గమనార్హం. యూకే, బహ్రైన్లో అనుమతి రాగానే ఫైజర్ భారత్పై ఆసక్తి చూపింది.
ఫైజర్ దరఖాస్తుపై భారత్లోని నిపుణుల కమిటీ ఫిబ్రవరి 3న సమీక్ష నిర్వహించింది. టీకా భద్రతపై ఇంకా అదనపు సమాచారం కావాలని కంపెనీ ప్రతినిధులకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తును వెనక్కి తీసుకుంటున్నట్లు ఫైజర్ వెల్లడించింది. కమిటీ కోరిన సమాచారం అందుబాటులోకి రాగానే మరోసారి దరఖాస్తు చేసుకుంటామని తెలిపింది. భారత ప్రజలకు కొవిడ్ టీకాను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.
భారత్లో వినియోగానికి ఫైజర్ గత డిసెంబరులో దరఖాస్తు చేసుకుంది. కొవిడ్ నిరోధం కోసం తయారు చేసిన వ్యాక్సిన్ను దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని కోరింది. అలాగే భారత్లో క్లినికల్ పరీక్షలు తప్పనిసరిగా జరపాలన్న నిబంధనన నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీనికి అంగీకరించని నిపుణుల కమిటీ మరింత సమాచారంతో రావాలని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్