పియాజియో నుంచి రూ.1.26లక్షల స్కూటర్‌

పియాజియో ఇండియా ప్రీమియం శ్రేణిలో ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 అనే కొత్త స్కూటర్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.26 లక్షలు(ఎక్స్‌-షోరూమ్‌ పుణె)గా నిర్ణయించారు..........

Published : 30 Dec 2020 15:50 IST

ముంబయి: పియాజియో ఇండియా ప్రీమియం శ్రేణిలో ‘ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160’ అనే కొత్త స్కూటర్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.26 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ పుణె)గా నిర్ణయించారు. సింగిల్‌ సిలిండర్‌ 4 స్ట్రోక్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ స్కూటర్‌ 7100 ఆర్‌పీఎం వద్ద 11 పీఎస్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంధన ట్యాంకు సామర్థ్యం ఏడు లీటర్లు . ఈ స్కూటర్‌ యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టం, వెంటిలేటెడ్‌ డిస్క్‌ బ్రేక్‌తో వస్తోంది. డిజిటల్ స్పీడ్‌ ఇండికేటర్‌, ఆర్‌పీఎం మీటర్‌, మైలేజ్‌ ఇండికేటర్‌, సగటు వేగం, టాప్‌ స్పీడ్‌ డిస్‌ప్లే, డిజిటల్‌ ఫ్యుయల్‌ ఇండికేటర్‌, ఇంజిన్‌ మాల్‌ఫంక్షన్‌ ఇండికేటర్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఈ స్కూటర్‌ సొంతం. కావాలనుకున్నప్పుడు స్కూటర్‌ను మొబైల్‌కు అనుసంధానించే సాంకేతికత దీనిలో పొందుపర్చారు. దీంతో వాహన భద్రత పెరగనుందని కంపెనీ తెలిపింది.

‘ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160’.. సరికొత్త టెక్నాలజీ, మరింత మంచి ప్రయాణ అనుభూతి అందించడమే కాకుండా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని పియాజియో ఇండియా ఛైర్మన్‌, ఎండీ డియాగో గ్రాఫీ తెలిపారు. విక్రయశాలలతో పాటు ఆన్‌లైన్‌లో ఈ మోడళ్లను బుక్‌ చేసుకోవచ్చు. రూ.5,000 చెల్లించి బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

ఇవీ చదవండి..

భారత్‌లో అమెరికా కీలక పెట్టుబడులు

చైనా నుంచి 120-130 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని