Demonetisation: డిజిటల్ చెల్లింపులే కాదు.. నోట్ల చలామణీ పెరుగుతోంది
పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ.. కరెన్సీ నోట్ల చెలామణి సైతం క్రమంగా ఎగబాకుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి....
దిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ.. కరెన్సీ నోట్ల చలామణి సైతం క్రమంగా పుంజుకుంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కొవిడ్-19 మూలంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ముందుజాగ్రత్తగా నగదు దగ్గర ఉంచుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల చలామణి పెరిగింది. డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, చెల్లింపు యాప్లు.. ఇలా పలు సాధనాల ద్వారా డిజిటల్ చెల్లింపులు సైతం భారీగా పెరిగాయి. ముఖ్యంగా యూపీఐకి దేశంలో భారీ ఆదరణ లభిస్తోంది.
నల్లధనం కట్టడి, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ ఐదేళ్ల క్రితం నవంబరు 8న రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, డిజిటల్ చెల్లింపుల లక్ష్యం ఒకింత ఫలితాలిచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, గత సంవత్సరం కాలంగా నోట్ల చలామణి మళ్లీ పెరుగుతుండడం గమనార్హం.
ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. నవంబరు 4, 2016లో(నోట్ల రద్దుకు ముందు) రూ.17.74 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణిలో ఉన్నాయి. అక్టోబరు 29, 2021 నాటికి అవి రూ.29.17 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక గత ఏడాది కాలంలో చలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.2,28,963 కోట్లు పెరిగింది. క్రితం ఏడాది ఈ పెరుగుదల రూ.4,57,059 కోట్లుగా నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో చలామణిలో ఉన్న నోట్ల సంఖ్య 16.8 శాతం పెరగ్గా.. వాటి విలువ రూ.7.2 శాతం పెరిగింది. 2019-20లో ఇవి వరుసగా రూ.14.7 శాతం, 6.6 శాతంగా ఉన్నాయి.
యూపీఐ సేవలను 2016లో ప్రారంభించిన విషయం తెలిసిందే. నెలనెలా ఈ మాధ్యమం ద్వారా చేస్తోన్న చెల్లింపుల సంఖ్య పెరుగుతోంది. అక్టోబరులో 421 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.7.71 లక్షల కోట్లుగా నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్