Elon Musk: కార్ల తయారీ కష్టమంటున్న మస్క్‌.. ఏకీభవించిన ఆనంద్‌ మహీంద్రా!

కార్ల తయారీ కష్టమని ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ ఎలాన్ మస్క్‌ అన్నారు. అలాగే లాభాలతో కార్ల తయారీ సంస్థను నడపడం ఇంకా కష్టమని తెలిపారు. మస్క్‌ వ్యాఖ్యలతో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఏకీభవించారు....

Published : 08 Sep 2021 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్ల తయారీ కష్టమని ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ అన్నారు. అలాగే లాభాలతో కార్ల తయారీ సంస్థను నడపడం ఇంకా కష్టమని తెలిపారు. మస్క్‌ వ్యాఖ్యలతో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఏకీభవించారు. కష్టమైనప్పటికీ.. ఈ రంగంలోనే గత నాలుగు దశాబ్దాలుగా చెమటోడుస్తూనే ఉన్నామన్నారు. చివరకు అదే తమ జీవన శైలిగా మారిపోయిందన్నారు. ఇదంతా ట్విటర్‌ వేదికగా జరిగిన చర్చ. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌పై మస్క్‌ ఇంకా స్పందించాల్సి ఉంది.

జేమ్స్‌ డైసన్‌ అనే ప్రముఖ బ్రిటిష్ శాస్త్రవేత్త, బిలియనీర్‌ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం ఇటీవల విడుదలైంది. దీన్ని చదివిన ఆంటోనీ అనే ఓ ఇంజినీర్.. పుస్తకంలో ఉన్న కీలకాంశాల్ని హైలైట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. చాలా కాలం క్రితం విద్యుత్తు కార్లను తయారు చేసేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేసి డైసన్ విఫలమైన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మస్క్‌.. కార్ల తయారీ కష్టమని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న సంప్రదాయ కార్ల తయారీ సంస్థలు తక్కువ లేదా ఎలాంటి లాభం లేకుండానే వాహనాలు విక్రయిస్తున్నాయని తెలిపారు. కొంతకాలం తర్వాత కార్లలో రీప్లేస్‌ చేయాల్సిన విడిభాగాల ద్వారానే కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నాయని తెలిపారు. అయితే, ఇప్పటి కార్ల తయారీ సంస్థలకు ఆ ఆస్కారం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని