పొగాకుపై పన్ను పెంచండి.. జీఎస్టీ కౌన్సిల్కు విజ్ఞప్తి
ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చడానికి అన్ని పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ పెంచాలని వైద్యులు, ఆర్థికవేత్తలతో పాటు ప్రజారోగ్య సంఘాల ప్రతినిధులు జీఎస్టీ మండలిని కోరారు.
హైదరాబాద్: ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చడానికి అన్ని పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ పెంచాలని వైద్యులు, ఆర్థికవేత్తలతో పాటు ప్రజారోగ్య సంఘాల ప్రతినిధులు జీఎస్టీ మండలిని కోరారు. సెప్టెంబర్ 17న జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానున్న నేపథ్యంలో తమ అభ్యర్థనను పరిగణించాలని వారు విజ్ఞప్తి చేశారు. పొగాకు నుంచి వచ్చే ఈ పన్ను ఆదాయం కొవిడ్ మహమ్మారి వేళ ఉపయోగపడుతుందని, వ్యాక్సిన్లు, మూడో వేవ్ ఎదుర్కోవడానికి కావాల్సిన ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడుతుందని వారు ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.
కొవిడ్ మొదటి వేవ్ కంటే రెండో వేవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిందని, ఆర్థిక వ్యవస్థపైనా దీని ప్రభావం పడిందని వారు పేర్కొన్నారు. దీంతో పలు ఉద్దీపన చర్యలను కేంద్రం ప్రకటించిందన్నారు. దేశం మూడో వేవ్కు సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్సును పెంచాలని వారు కేంద్రాన్ని కోరారు. ఈ నిర్ణయం వల్ల ఆదాయం పెరగడమే కాకుండా పొగాకు సంబంధిత వ్యాధులను అరికట్టినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వినియోగదారుల జాబితాలో దేశం రెండో స్థానంలో ఉందని, ఏటా లక్షల సంఖ్యలో మరణిస్తున్నారని విచారం వ్యక్తంచేశారు. దేశంలోని క్యాన్సర్లకు 27 శాతం పొగాకే కారణమవుతోందని అభిప్రాయపడ్డారు. పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ పెంచడం ఉత్తమమైన ప్రతిపాదన అని, ఆదాయం పెంచడంతో పాటు యువతను పొగాకు దూరంగా ఉంచేందుకు ఉపకరిస్తుందని వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ భావనా ముఖోపాధ్యాయ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్