అసలు పీఎన్బీ స్కామ్ ఏంటి?
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం పీఎన్బీ (పంజాబ్ నేషనల్ బ్యాంక్)స్కామ్. ఇంతకీ ఏంటీ స్కామ్? ఇదెలా జరిగింది? మన బ్యాంకింగ్ వ్యవస్థ దృడమైందని చెప్పుకున్నా పారదర్శకత లోపమే..
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం పీఎన్బీ (పంజాబ్ నేషనల్ బ్యాంక్)స్కామ్. ఇంతకీ ఏంటీ స్కామ్? ఇదెలా జరిగింది? మన బ్యాంకింగ్ వ్యవస్థ దృడమైందని చెప్పుకున్నా పారదర్శకత లోపమే ఇలాంటి స్కామ్ లకు కారణమా? దీని గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పీఎన్బీ స్కామ్ గురించి…
నిరావ్ మోదీ వజ్రాల వ్యాపారానికి కావల్సిన డబ్బు పంజాబ్ నేషనల్ బ్యాంకు దగ్గర రుణంగా తీసుకోవాలి. అయితే ఆ రుణం పై చల్లించే వడ్డీ శాతం ఎక్కువగా ఉండటంతో తన దిగుమతి దారులకు విదేశీ కరెన్సీలోనే డబ్బు చెల్లించేందుకు విదేశాల్లో ఉన్న బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
విదేశీ బ్యాంకులు నిరావ్ మోదీకి ఎందుకు రుణాలను మంజూరు చేశాయంటే…
వజ్రాల వ్యాపారంలో భాగంగా విదేశాల నుంచి వజ్రాలను దిగుమతి చేసుకుని వాటిని భారత్ లో ఆభరణాలుగా తయారు చేసి నిరావ్ మోదీ విక్రయిస్తుంటారు. విదేశాల నుంచి వజ్రాలను కొనుగోలు చేసేందుకు అక్కడ చెల్లింపులు ఆ దేశ కరెన్సీలో చేయాల్సి ఉంటుంది. అందుకు నిరావ్ ఆ దేశంలో ఉండే బ్యాంకులు నేరుగు దిగుమతి సంస్థలకు చెల్లించే విధంగా మన దేశంలోని బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నారు. దీన్నే లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అంటారు. దీని ద్వారా ఆయా బ్యాంకులు వజ్రాల విక్రయ సంస్థలకు నిరావ్ సంస్థ తరుపున చెల్లింపులు చేస్తాయి.
నిరావ్ సంస్థకు పీఎన్బీ తో ఎల్ఓయూ (లెటర్ ఆఫ్ అండర్టేకింగ్) ఒప్పందం జరిగింది కాబట్టి పీఎన్బీ ఈ విషయంలో నిరావ్ కు హామీగా ఉంది. దీనికి బ్యాంకు కొంత డబ్బు రుసుము తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఎటువంటి తనఖా లేకుండా పీఎన్బీ హామీ ఇవ్వడం సమస్య గా మారింది.
పీఎన్బీ ఎందుకు ఆస్తులను తనఖా పెట్టుకోలేదు?
చిన్న వ్యాపారులు, ఖాతాదారులు ఎవరైనా రుణం కావాలంటే చాలా పక్కాగా బ్యాంకులు వ్యవహరిస్తుంటాయి. ఇంత పెద్ద మొత్తంలో హామీ ఉంటూ ఎందుకు తనఖాగా ఆస్తులు అడగలేదు. మాల్యా ఉదంతం జరిగిన తరువాత కూడా బ్యాంకులు ఈవిధమైన ధోరణిని అనుసరించడం చాలా దారుణమైన విషయంగా పరిగణించాలి.
పీఎన్బీ గ్యారంటీ ఇవ్వడానికి కారణం?
సాధారణంగా ప్రస్తుతం బ్యాంకులన్నీ ఎల్ఓయూలు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయి. ఎందుకంటే బ్యాంకుల మధ్య వ్యాపారపరంగా పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి తప్పిదాలు జరిగేందుకు అవకాశం ఎక్కవ. ఇంతకీ ఈ స్కామ్ 11వేల కోట్లని మొదట అన్నారు. తర్వాత 17 వేలు, 20 వేలు కోట్లు అలా అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.
గమనిక
ప్రభుత్వం పేర్కొన్న చట్టం ప్రకారం ప్రభుత్వ బ్యాంకులు దివాళా తీసేందుకు అవకాశం లేదు. ఖాతాదార్ల సొమ్ము భద్రంగా ఉంటుంది. కాబట్టి ఖాతాదారులు ఎవరూ కంగారు పడి పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు.
పీఎన్బీకి చెందిన కొందరు ఉన్నత స్థాయి అధికారులు, ఆడిటర్ల పాత్ర లేనిదే ఈ ఉదంతం జరగడం అసాధ్యం. ఎందుకంటే ఆడిటర్లు తరచూ బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు ప్రతీ బ్రాంచీకి వెళ్లి తనిఖీచేస్తారు. ఆడిటింగ్ చేసే సమయంలో కూడా ఈ స్కామ్ బయట పడకపోవడం పలు రకాల అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా ఎంత మంది దీని వెనుక ఉన్నారనేది తేలాల్సిఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్