RBI: కేంద్రానికి రూ. 99,122 కోట్ల నిధులు
కరోనా సంక్షోభం వేళ ప్రభుత్వం ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భారతీయ రిజర్వ్బ్యాంక్(ఆర్బీఐ) నుంచి భారీగా నిధులు రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 99,122 కోట్ల
ముంబయి: కరోనా సంక్షోభం వేళ ప్రభుత్వం ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భారతీయ రిజర్వ్బ్యాంక్(ఆర్బీఐ) నుంచి భారీగా నిధులు రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 99,122 కోట్ల మిగులు ద్రవ్యాన్ని ఆర్బీఐ కేంద్రానికి డివిడెంట్ రూపంలో చెల్లించనుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదముద్ర పడింది. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయిన వేళ ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
కరెన్సీ ట్రేడింగ్, బాండ్ల ట్రేడింగ్ నుంచి ఆర్బీఐ భారీగా ఆదాయం పొందుతుంది. దీనిలో తన కార్యాకలాపాల కోసం కొంత మొత్తం ఉంచుకొని మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల కోసం అందజేస్తుంది. అలా ఇప్పుడు కూడా రూ. 99,122 కోట్లను పంపించేందుకు నిర్ణయించినట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది కరోనా తొలి దశ సమయంలోనూ రిజర్వ్ బ్యాంకు డివిడెంట్ పంపించింది. అప్పుడు మొత్తం మిగులు ద్రవ్యంలో 44శాతం అంటే రూ. 57వేల కోట్లకు కేంద్రానికి ఇచ్చింది. గత ఏడు సంవత్సరాల్లో ఆర్బీఐ ఇచ్చిన అత్యంత తక్కువ డివిడెంట్ అదే.
ప్రస్తుతం రెండో దశ కరోనా ఉద్ధృతంగా ఉంది. వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు, ఆంక్షలు విధించారు. దీంతో అనేక వ్యాపారాలు మూతబడ్డారు. గతేడాది కరోనా సంక్షోభ పరిస్థితి నుంచి కాస్త తేరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థపై తాజా ఆంక్షలు మరోసారి ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు