
Reliance Capital: రిలయన్స్ క్యాపిటల్ బోర్డు రద్దు.. ఆర్బీఐ కీలక నిర్ణయం!
దివాలా పరిష్కార స్మృతి ప్రయోగానికి సిద్ధమైన రిజర్వు బ్యాంకు
దిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ ప్రమోటర్గా ఉన్న రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్(ఆర్సీఎల్)పై దివాలా పరిష్కార స్మృతి (ఐబీసీ- ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్)ని ప్రయోగించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. అందులో భాగంగా నేడు కంపెనీ బోర్డును రద్దు చేసింది. ఆ స్థానంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్వర్ రావును అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. త్వరలో ఐబీసీ పరిష్కార ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఆర్బీఐ తెలిపింది. అలాగే దివాలా పరిష్కార ప్రక్రియ ప్రతినిధిగా ఓ అడ్మినిస్ట్రేటర్ను నియమించాలని కోరుతూ ముంబయి ఎన్సీఎల్టీ (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్)కి దరఖాస్తు చేయనున్నట్లు పేర్కొంది. రుణాల చెల్లింపులు, గవర్నెన్స్లో లోపాలను సకాలంలో సరిదిద్దడంలో విఫలమవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.