కొనుగోళ్ల వర్షం
మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు దుమ్మురేపడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు ఇందుకు కలిసొచ్చాయి. రూపాయి కోలుకోవడం, వరుస ఐపీఓలూ సెంటిమెంటును మెరుగు పరిచాయి.
బలంగా పుంజుకున్న సూచీలు
మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు దుమ్మురేపడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు ఇందుకు కలిసొచ్చాయి. రూపాయి కోలుకోవడం, వరుస ఐపీఓలూ సెంటిమెంటును మెరుగు పరిచాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 74.46 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ రాణించాయి. ఐరోపా సూచీలు సానుకూలంగా కదలాడాయి.
సెన్సెక్స్ ఉదయం 52,494.56 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. ఆద్యంతం అదే జోరు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 52,867.26 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 638.70 పాయింట్ల లాభంతో 52,837.21 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 191.95 పాయింట్లు రాణించి 15,824.05 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,726.40- 15,834.80 పాయింట్ల మధ్య కదలాడింది.
* ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలతో గ్లాండ్ ఫార్మా షేరు ఇంట్రాడేలో 9.62% పెరిగి రూ.4168 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 8.98 శాతం లాభంతో రూ.4143.60 వద్ద ముగిసింది.
* త్రైమాసిక లాభం నాలుగింతలు కావడంతో హావెల్స్ షేరు 4.35 శాతం లాభంతో రూ.1151.45 దగ్గర స్థిరపడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 26 లాభాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా అత్యధికంగా 5.65% పెరిగింది. బజాజ్ ఫైనాన్స్ 4.21%, భారతీ ఎయిర్టెల్ 3.93%, బజాజ్ ఫిన్సర్వ్ 3.72%, టాటా స్టీల్ 3.27%, ఎల్ అండ్ టీ 3.24%, ఇన్ఫోసిస్ 2.61%, ఐసీఐసీఐ * బ్యాంక్ 2.15%, టైటన్ 2.13% చొప్పున లాభపడ్డాయి. హెచ్యూఎల్ 2.27%, ఏషియన్ పెయింట్స్ 1.73%, బజాజ్ ఆటో 1.32% మేర నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో లోహ, టెలికాం, యంత్ర పరికరాలు, పరిశ్రమలు, విద్యుత్, ఐటీ 3.02% * శాతం మేర పెరిగాయి. ఎఫ్ఎమ్సీజీ డీలాపడింది. బీఎస్ఈలో 2184 షేర్లు లాభపడగా, 1065 స్క్రిప్లు నష్టపోయాయి. 138 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
మదుపర్ల వివరాల కోసం ఎదురుచూస్తున్నాం
వొడాఫోన్ ఐడియా ఎఫ్డీఐ ప్రతిపాదనపై డాట్
దిల్లీ: వొడాఫోన్ ఐడియా రూ.15,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ) ప్రతిపాదనకు ఆమోదం తెలిపేందుకు.. ఆ సంస్థ నుంచి మదుపర్ల వివరాల కోసం టెలికాం విభాగం ఎదురుచూస్తోంది. ‘వొడాఫోన్ ఐడియా రూ.15,000 కోట్లను సమీకరించే విషయంలో ఎలాంటి అభ్యతరం లేదు. అయితే ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలపాలంటే ముందుగా మదుపర్ల వివరాలను తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. తుది ఆమోదం కేంద్ర మంత్రివర్గమే ఇవ్వాల్సి ఉంటుంద’ని అధికారిక వర్గాలు వెల్లడించాయి. రూ.25,000 కోట్ల నిధులను సమీకరించేందుకు 2020 సెప్టెంబరులో వొడాఫోన్ ఐడియాకు బోర్డు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రణాళికను కంపెనీ పూర్తి చేయలేకపోయింది. కానీ.. తాజాగా దేశీయ కార్యకలాపాల కోసం రూ.15,000 కోట్ల నిధులను సమీకరించేందుకు ప్రభుత్వ అనుమతిని వొడాఫోన్ ఐడియా కోరింది.
నాలుగేళ్లలో రెట్టింపు సామర్థ్యం
రూ.600 కోట్ల పెట్టుబడులు
గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్
ముంబయి: తొలి పబ్లిక్ ఇష్యూకు రాబోతున్న బల్క్డ్రగ్ తయారీ సంస్థ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ వచ్చే నాలుగేళ్లలో తమ సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు రూ.600 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్కు అనుబంధ సంస్థగా రెండున్నరేళ్ల క్రితం ఏర్పాటైంది. ఈ సంస్థ ఐపీఓ ఈనెల 27న ప్రారంభం కాబోతోంది. రూ.1,060 కోట్ల తాజా ఈక్విటీ షేర్లతో సహా ప్రమోటర్ గ్లెన్మార్క్ ఫార్మా రూ.453 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్ధతిలో విక్రయించనుంది. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ 2001-02లో మహారాష్ట్రలోని కుర్కుంబ్ ప్లాంట్లో ఏపీఐ తయారీ మొదలుపెట్టింది. 2019లో గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ను నెలకొల్పింది. ‘బ్రెజిల్, మెక్సికో, రష్యా, కొరియా, తైవాన్, సౌదీ అరేబియా వంటి విపణుల్లోకి ప్రవేశించేందుకు సామర్థ్య విస్తరణకు దిగుతున్నామ’ని గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ సీఈఓ, ఎండీ యాసిర్ రజ్వి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’