రెనో, ఎంజీ మోటార్స్ వాహనాలూ ప్రియం
దేశీయ వాహన తయారీ కంపెనీలు కొత్త సంవత్సరం వేళ ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కార్ల తయారీ కంపెనీలైన మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్డ్ కంపెనీలు జనవరి 1 నుంచి ధరలు.....
దిల్లీ: దేశీయ వాహన తయారీ కంపెనీలు కొత్త సంవత్సరం వేళ ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కార్ల తయారీ కంపెనీలైన మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్డ్ కంపెనీలు జనవరి 1 నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో రెనో, ఎంజీ మోటార్స్ ఇండియా కూడా చేరాయి.
జనవరి 1 నుంచి మూడు శాతం వరకు ధరలు పెంచనున్నట్లు ఎంజీ మోటార్స్ తెలిపింది. మోడల్ను బట్టి ఒక్కో మోడల్పై ఒక్కో విధంగా ధరల పెరుగుదల ఉండనుందని వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం పెరగడమే ఇందుకు కారణమని వెల్లడించింది. అలాగే, సెవెన్ సీటర్ హెక్టార్ ప్లస్ మోడల్ను వచ్చే నెల తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీ హెక్టార్, జడ్ఎస్ ఈవీ, గ్లోస్టర్ కార్లను భారత్లో విక్రయిస్తోంది.
మరోవైపు రెనో సైతం ధరల పెంపును ప్రకటించింది. వివిధ మోడళ్లపై రూ.28 వేల వరకు ధరలు పెంచనున్నట్లు పేర్కొంది. స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి ముడి సరకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిందని, అందుకే పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ ప్రస్తుతం క్విడ్, డస్టర్, ట్రైబర్ కార్లను విక్రయిస్తోంది. ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటో కార్ప్ సైతం జనవరి 1 నుంచి ₹1500 వరకు ధరలు పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి..
మారుతీ మళ్లీ డీజిల్ సెగ్మెంట్లోకి..!
మైక్రోమ్యాక్స్ స్మార్ట్ఫోన్లు ఫ్లిప్కార్ట్లో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు