రీఫండ్ త్వరగా రావాలంటే ఇలా చేయండి!
పన్ను చెల్లింపుదారులకు కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఊరట కలిగించేందుకు ఆదాయ పన్ను శాఖ పెండింగ్లో ఉన్నరూ.5 లక్షల వరకు రీఫండ్ను జారీచేస్తోంది. కేవలం ఒక వారంలో రూ.4,250 కోట్ల రీఫండ్ను 10.2 లక్షల పన్ను చెల్లింపుదారులకు ఇచ్చినట్లు వెల్లడించింది. కొన్ని కేసుల్లో ఆదాయ పన్ను శాఖ, దృవీకరణ కోసం పన్ను చెల్లింపుదారులకు మె..
పన్ను చెల్లింపుదారులకు కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఊరట కలిగించేందుకు ఆదాయ పన్ను శాఖ పెండింగ్లో ఉన్నరూ.5 లక్షల వరకు రీఫండ్ను జారీచేస్తోంది. కేవలం ఒక వారంలో రూ.4,250 కోట్ల రీఫండ్ను 10.2 లక్షల పన్ను చెల్లింపుదారులకు ఇచ్చినట్లు వెల్లడించింది. కొన్ని కేసుల్లో ఆదాయ పన్ను శాఖ, దృవీకరణ కోసం పన్ను చెల్లింపుదారులకు మెయిల్స్ పంపుతుంది. ఆదాయ పన్ను విభాగం పంపిన మెయిల్స్కు ప్రస్తుతం 1.74 లక్షల వరకు ఇంకా స్పదించలేదని తెలిపింది.
రీఫండ్ మెయిల్స్ గురించి ఆదాయ పన్ను శాఖ స్పష్టత:
ఈ రిమైండర్ ఇ-మెయిల్స్ పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం కోసం అని ఆదాయపు పన్ను విభాగం తెలిపింది, ఎందుకంటే రీఫండ్ ఇవ్వడానికి ముందు వారి నుంచి స్పందన, వారి బ్యాంక్ ఖాతాలు ఏదైనా లోపం / అసమతుల్యతను ధృవీకరించడానికి ప్రయత్నిస్తుంది. మెయిల్స్ వచ్చిన వారందరు తమ ఇ-ఫైలింగ్ ఖాతాలోకి లాగిన్ కావడంతో, రీఫండ్ నిర్ధారణకు వెంటనే స్పందించాలని పన్ను అధికారులు విజ్ఞప్తి చేశారు. రీఫండ్ ఆలస్యమైనవారు, క్లెయిమ్లలో ఏదైనా లోపాలుంటే ఆదాయ పన్ను శాఖ పంపించిన మెయిల్స్కు స్పందిస్తే వారి రీఫండ్ను త్వరగా ప్రాసెస్ చేయడానికి వీలుంటుంది "అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్