రెండేళ్లుగా ప్రింట్ అవ్వని ₹2000!
నోట్ల రద్దు తర్వాత తొలిసారి వెలుగులోకి వచ్చిన రెండు వేల రూపాయిల నోటు.. గత రెండేళ్లుగా ప్రింటింగ్కు నోచుకోలేదట. వీటి సంఖ్య కూడా తగ్గడం గమనార్హం. ఈ విషయాన్ని కేంద్రం లోక్సభలో తెలియజేసింది. ఈ మేరకు.
దిల్లీ: నోట్ల రద్దు తర్వాత తొలిసారి వెలుగులోకి వచ్చిన రెండు వేల రూపాయిల నోటు.. గత రెండేళ్లుగా ప్రింటింగ్కు నోచుకోలేదట. వీటి సంఖ్య కూడా తగ్గడం గమనార్హం. ఈ విషయాన్ని కేంద్రం లోక్సభలో తెలియజేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2019 ఏప్రిల్ నుంచి ఒక్క నోటు కూడా ముద్రణ జరగలేదని తెలిపారు.
2018 మార్చి 30 నాటికి 3,362 మిలియన్ల రెండు వేల రూపాయల నోట్లు సర్క్యులేషన్లో ఉన్నాయని ఠాకూర్ తెలిపారు. సంఖ్యాపరంగా మొత్తం నోట్లలో వీటి వాటా 3.27 శాతం కాగా.. విలువ పరంగా 37.26 శాతంతో సమానమని తెలిపారు. 2021 ఫిబ్రవరి 26 నాటికి 2,499 మిలియన్ల నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నాయని చెప్పారు. సంఖ్యా పరంగా ఈ వాటా 2.01 శాతం కాగా.. విలువ పరంగా 17.78 శాతమని తెలిపారు. ప్రజల డిమాండ్కు అనుగుణంగా ఎన్ని నోట్లు ముద్రించాలనేది ఆర్బీఐని సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఠాకూర్ తెలిపారు. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2వేల రూపాయిల ముద్రణకు సంబంధించి ప్రింటింగ్ ప్రెస్కు ఎలాంటి ఇండెంట్ వెళ్లలేదని చెప్పారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు