రూపే కార్డుతో బీమా
దేశవాళీ రూపే కార్డు కలిగి ఉన్నవారికి రూ.1లక్ష బీమా వర్తిస్తుంది. ఏ సందర్భాల్లో చూడండి...
రూపే కార్డును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) దేశవాళీ కార్డుగా అభివృద్ధి చేసింది. ఈ కార్డు వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇప్పటికే రోజువారీ బిల్లుచెల్లింపులు, ఆహార పదార్థాల కొనుగోళ్లు, ఐఆర్సీటీసీ టిక్కెట్ల బుకింగ్కు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తోంది. వీటికి అదనంగా ఈ కార్డు ఉన్నవారికి ప్రమాద బీమాను కల్పిస్తున్నారు. బీమాకు అవసరమైన అర్హతలు, విధి విధానాలు, క్లెయిం విధానాలను తెలుసుకుందాం.
అర్హతలు:
-
మొదటిసారి రూపే కార్డు పొందిన వారందరూ ఈ బీమాకు అర్హులు. ఒక వ్యక్తి ఎన్ని రూపే కార్డులను కలిగి ఉన్నప్పటికీ ఒక కార్డుకు మాత్రమే సంపూర్ణంగా ప్రమాద బీమా వర్తిస్తుంది. వ్యక్తి వయసు 18 నుంచి 70 ఏళ్ల లోపు ఉండాలి.
-
శాశ్వత, పాక్షిక శారీరక వైకల్యం ఏర్పడిన సందర్భాల్లో బీమా ఇస్తారు. కొన్ని రకాల పాక్షిక వైకల్యాలకు రూ. 2 వేల పరిహారం చెల్లిస్తారు.
-
ప్రమాదానికి 90 రోజుల ముందు కార్డును కనీసం ఒక్కసారైనా వినియోగించి ఉండాలి.
క్లెయిం కోసం అవసరమయ్యే పత్రాలు
ప్రమాదం వల్ల మరణం సంభవించిన సందర్భాల్లో…
పూర్తి చేసిన క్లెయిం దరఖాస్తు ఫారం, ఒరిజినల్ మరణ ధ్రువీకరణ పత్రం, ఎఫ్ఐఆర్ కాపీ, పంచనామా, పాలసీదారు ఫోటో, కేవైసీ పత్రాలు.
శాశ్వత వైకల్యం పొందితే…
పూర్తి చేసిన క్లెయిం దరఖాస్తు ఫారం, డిశ్చార్జి కార్డు, వైకల్యానికి సంబంధించిన ధ్రువీకరణ, ఎఫ్ఐఆర్ కాపీ, పాలసీదారు ఫోటో, కేవైసీ పత్రాలు
బీమా హామీ సొమ్ము
క్లాసిక్ కార్డు కలిగిన వారికి రూ. 1 లక్ష వరకూ, ప్రీమియం కార్డు కలిగిన వారికి రూ. 2 లక్షల వరకూ బీమా వర్తిస్తుంది.
క్లెయిం విధానం:
-
ఏదైనా ప్రమాదానికి గురైన తర్వాత వీలైనంత తొందరగా ఖాతా ఉన్న బ్యాంకుకు సమాచారం అందించాలి.
-
బీమా హామీ మొత్తాన్ని పొందేందుకు సంఘటన జరిగిన 90 రోజుల్లోగా అధీకృత సంస్థకు తెలియజేయాలి.
-
క్లెయిం గురించి కంపెనీకి తెలిపిన రోజు నుంచి 60 రోజుల్లోగా క్లెయిం సంబంధిత పత్రాలను అందజేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు