SBI Q2 Results: అదరగొట్టిన ఎస్బీఐ.. లాభాల్లో 67% వృద్ధి
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)’ రెండో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. ఏకీకృత నికర లాభాల్లో 69 శాతం వృద్ధి నమోదు చేసింది...
దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)’ రెండో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. ఏకీకృత నికర లాభాల్లో 69 శాతం వృద్ధి నమోదు చేసింది. జులై - సెప్టెంబరు త్రైమాసికంలో రూ.8,889.84 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ.5,245.88 కోట్లుగా ఉంది. ఇక ఎస్బీఐ మొత్తం ఏకీకృత ఆదాయం క్రితం ఏడాది నమోదైన రూ.95,373.50 కోట్ల నుంచి రూ.1,01,143.26 కోట్లకు పెరిగింది. ఇక సమీక్షిస్తున్న త్రైమాసికంలో స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన కూడా బ్యాంకు లాభం 67 శాతం పెరిగింది. ఆదాయం(స్టాండ్ఎలోన్) రూ.75,341.80 కోట్ల నుంచి రూ.77,689.09 కోట్లకు పెరిగింది. ఈ త్రైమాసికంలో కొత్త నిరర్థక ఆస్తులు 4.90 శాతంగా నమోదుకాగా.. మొత్తంగా బ్యాంకు నికర నిరర్థక ఆస్తులు 1.52 శాతానికి తగ్గాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ