SBI Rakshabandhan Offer: ఎస్బీఐ రక్షాబంధన్ డిస్కౌంట్లు!
దేశవ్యాప్తంగా పండగ వాతావరణం ప్రారంభమైంది. దీంతో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు బ్యాంకులు సమాయత్తమవుతున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ....
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా పండగ వాతావరణం ప్రారంభమైంది. దీంతో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు బ్యాంకులు సమాయత్తమవుతున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
* ‘ఫెర్న్స్ అండ్ పెటల్స్’లో బహుమతులు కొనుగోలు చేసేవారు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా చెల్లింపులు చేస్తే 20 శాతం కచ్చితమైన రాయితీ లభించనుంది. ఎంత కనీస మొత్తానికైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది. గరిష్ఠంగా రూ.999 వరకు రాయితీ పొందొచ్చు. ‘ఎస్బీఐ20’ అనే కూపన్ కోడ్ ఉపయోగించాలి. ఈ ఆఫర్ ఆగస్టు 22 వరకు అందుబాటులో ఉండనుంది.
* ఇక గిఫ్టింగ్ పోర్టల్ ఐజీపీ.కామ్లో బహుమతులు కొనుగోలు చేసేవారికి ఎస్బీఐ సాధనాల ద్వారా చెల్లింపులు చేస్తే 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా చెల్లిస్తే అదనంగా మరో 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. దీనికి ‘ఐజీపీఎస్బీఐ’ అనే కూపన్ కోడ్ వినియోగించాలి. ఈ ఆఫర్ కూడా 22 ఆగస్టు వరకు అందుబాటులో ఉండనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!