SBI Update: ఎస్బీఐ ఏటీఎంకు వెళ్తున్నారా..? మొబైల్ పట్టుకెళ్లడం మరిచిపోకండి!!
ఏటీఎమ్ వద్ద జరిగే నగదు విత్డ్రా మోసాలపై వ్యాక్సిన్లా ఓటీపీ విధానం పనిచేస్తుందని ఎస్బీఐ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏటీఎంల వద్ద జరిగే మోసాలను నివారించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) విధానాన్ని తీసుకొచ్చింది. ఏటీఎంల వద్ద జరిగే అనధికారిక లావాదేవీలను నుంచి ఖాతాదారులకు ఈ విధానం రక్షణ కల్పిస్తుంది. రూ.10 వేలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో నగదు విత్డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డుతో పాటు ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ విధానం.. మోసగాళ్ల నుంచి ఖాతాదారులకు రక్షణ కల్పిస్తుందని ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ ద్వారా తెలిపింది. అయితే ఈ విధానం ఎస్బీఐ ఏటీఎంల వద్ద మాత్రమే అందుబాటులో ఉంది.
ఓటీపీ ఆధారిత క్యాష్ విత్డ్రా సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
* ఈ విధానంలో ఎస్బీఐ ఏటీఎంల వద్ద నగదు విత్డ్రా చేసేందుకు ఓటీపీ అవసరం.
* ఖాతాదారుడు బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది.
* ఓటీపీ అనేది నాలుగు అంకెల సంఖ్య. ఒకసారి వచ్చిన ఓటీపీ ఒక లావాదేవీకి మాత్రమే పనిచేస్తుంది.
* ఏటీఎంలో కార్డు ఇన్సర్ట్ చేసి, డెబిట్ కార్డు పిన్ నంబర్, విత్డ్రా మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలని అడుగుతుంది.
* రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తేనే క్యాష్ వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్