ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ
దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ సౌర్యాలు గణనీయంగా మెరుగుపడినప్పటికీ కొత్త రూపంలో....
కస్టమర్లకు మరోసారి హెచ్చరిక!
ముంబయి: దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడినప్పటికీ కొత్త రూపంలో చోటుచేసుకుంటున్న మోసాలు ఖాతాదారులను నిలువునా ముంచేస్తున్నాయి. ప్రజలు తమ మొబైల్ నుంచి వేర్వేరు యాప్ల ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ తరుణంలో రిజర్వు బ్యాంకు సహా అనేక బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు డిజిటల్ మోసాలపై హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ తన ఖాతాదారులను మరోసారి అప్రమత్తం చేసింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని స్మార్ట్ఫోన్లలో ఉంచొద్దని సూచించింది. బ్యాంకింగ్ మోసాలు పెరిగిపోతుండటంతో స్మార్ట్ఫోన్లలో బ్యాంకింగ్ పిన్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సమాచారం, వాటి పాస్వార్డ్లు, సీవీవీ నంబర్ సహా కీలక సమాచారాన్ని దాచి ఉంచితే మోసాల బారిన పడే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని హెచ్చరించింది. అందువల్ల బ్యాంకింగ్ సంబంధిత కీలక సమాచారాన్ని తక్షణమే ఫోన్లో నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్