ఎన్పీఎస్లో చేరడానికి రెండో అవకాశం
ముందస్తు ఉపసంహరణను ఎంచుకొని తిరిగి రద్దు చేసుకోవాలనుకునేవారికి పీఎఫ్ఆర్డీఏ రెండు ఆప్షన్లు ఇచ్చింది.....
ముందస్తు ఉపసంహరణను ఎంచుకొని తిరిగి రద్దు చేసుకోవాలనుకునేవారికి పీఎఫ్ఆర్డీఏ రెండు ఆప్షన్లు ఇచ్చింది
పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఆర్డిఎ) ఈ పథకం నుంచి ముందస్తుగా ఉపసంహరించుణ ఎంచుకున్న జాతీయ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) చందాదారులకు మరో అవకాశం ఇచ్చింది.
ఉపసంహరించుకున్న మొత్తాన్ని తిరిగి డిపాజిట్ చేయడం ద్వారా లేదా కొత్త శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN) తెరవడం ద్వారా చందాదారులు దీన్ని ప్రారంభించవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, చందాదారులు ఎన్పీఎస్ నుంచి 60 ఏళ్ల కంటే ముందే ముందస్తుగా నిష్క్రమించవచ్చు. అయితే, ఈ సందర్భంలో, వారి కార్పస్లో 80శాతం యాన్యుటీకి వెళ్తుంది. మిగిలిన 20 శాతం ఉపసంహరించుకోవచ్చు. రెండు భాగాలు పన్ను పరిధిలోకి వస్తాయి.
ఎన్పీఎస్లో నుంచి 20 శాతాన్ని ఉపసంహరించుకున్నా, ఇంకా యాన్యుటీ (80% కార్పస్) పొందని చందాదారుల నుంచి చాలా అభ్యర్థనలు వచ్చిన తరువాత, రెగ్యులేటర్ వారిని పెన్షన్ పథకానికి తిరిగి రావడానికి అనుమతించింది.
ముందస్తు ఉపసంహరణను ఎంచుకొని తిరిగి రద్దు చేసుకోవాలనుకునేవారికి పీఎఫ్ఆర్డీఏ రెండు ఆప్షన్లు ఇచ్చింది. మొదట, వారు ఉపసంహరించుకున్న 20 శాతం తిరిగి చెల్లించవచ్చు, వారి ప్రస్తుత PRAN క్రింద ఈ పెట్టుబడులు కొనసాగించవచ్చు. ఈ ఎంపికను జీవితకాలంలో ఒకసారి మాత్రమే పొందవచ్చు , రీ-డిపాజిట్ ఒకే విడతలో చేయాలి. రెండవది, యాన్యుటీని ఎంచుకొని ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినవారు కొత్త PRAN తో కొత్త ఎన్పీఎస్ ఖాతాను తెరిచి దానిలో డిపాజిట్ చేయడం ప్రారంభించవచ్చు.
మొదటి ఎంపికను ఎంచుకునే చందాదారులు నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక సలహాదారులను సంప్రదించాలి. ముందస్తుగా ఎన్పీఎస్ నుంచి ఉపసంహరించుకుంటే దానిపై పన్ను వర్తిస్తుంది. రీ-డిపాజిట్ చేస్తే దానిపై పన్ను వర్తిస్తుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఎన్పీఎస్ నుంచి ముందస్తుగా ఉపసంహరించుకోవాలని అనుకునేవారు పాక్షిక ఉపసంహరణ ఎంచుకోవడం మంచిది. ఎన్పీఎస్ నుంచి మూడు సార్లు చందాదారుడు డిపాజిట్ చేసిన మొత్తం నుంచి 25 శాతం తీసుకునే అవకాశం ఉంది. దీనికి పన్ను వర్తించదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!