stock market: భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.22 సమయంలో సెన్సెక్స్‌ 444 పాయింట్లు పెరిగి 58,232

Updated : 16 Dec 2021 09:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.22 సమయంలో సెన్సెక్స్‌ 444 పాయింట్లు పెరిగి 58,232 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు ఎగబాకి 17,349 వద్ద ట్రేడవుతున్నాయి. హెగ్‌ లిమిటెడ్‌, ట్రైడెంట్‌, నిర్లాన్‌, మైండ్‌ ఇండస్ట్రీస్‌, ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌ సంస్థల షేర్లు లాభాల్లో ఉండగా.. ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, రత్నమణి మెటల్స్‌, టొరెంట్‌ పవర్‌, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌, టీవీఎస్‌ మోటార్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

బీఎస్‌ఈలో అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, టెక్‌ సూచీలు భారీగా ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నిక్కీ సూచీ 1.4శాతం, తైవాన్‌, కొరియా దేశాల సూచీలు 0.5, 0.3శాతం పెరిగాయి. అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ 2.2శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 1.6శాతం, డోజోన్స్‌ 1.1శాతం లాభపడ్డాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడి.. బుల్‌ జోరందుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని