నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మూడు రోజుల తర్వాత తొలిసారి నష్టాల్లోకి చేరాయి. ఉదయం 9.39 సమయంలో సెన్సెక్స్ 247 పాయింట్లు పతనమై 50,008 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు తగ్గి 14,742 వద్ద ఉన్నాయి.
ఇంటర్నెట్డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మూడు రోజుల తర్వాత తొలిసారి నష్టాల్లోకి చేరాయి. ఉదయం 9.39 సమయంలో సెన్సెక్స్ 247 పాయింట్లు పతనమై 50,008 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు తగ్గి 14,742 వద్ద ఉన్నాయి. ప్రిన్స్పైప్ అండ్ ఫింట్, హింద్కాపర్, సొమాని హోం ఇన్నోవేట్, జుబ్లియంట్ ఫుడ్వర్క్, అపోలో టైర్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. క్విక్ హీల్ టెక్నాలజీస్, ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్, ఫ్యూచర్ సప్లై ఛైన్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కన్జ్యూమర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
భారీ లాభాల అనంతరం మదుపరులు లాభాల స్వీకరణ మొదలుపెట్టడంతో సూచీలు నష్టపోయాయి. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒకశాతం వరకు నష్టపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో షేర్లు భారీగా లాభపడుతున్నాయి. నేడు ఎస్బీఐ, హీరోమోటో, అదానీ పవర్, హెచ్పీసీఎల్, ఎన్టీపీసీ, టాటాపవర్, గోద్రెజ్ ప్రాపర్టీస్, జీ ఎంటర్టైన్మెంట్ వంటి కంపెనీలు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం