భారీ లాభాల్లో మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్ 544 పాయింట్ల లాభంతో 51,326 వద్ద, నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 15,149 వద్ద ట్రేడవుతున్నాయి. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, మ్యాక్స్ ఫైనాన్షియల్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
ఇంటర్నెట్డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్ 544 పాయింట్ల లాభంతో 51,326 వద్ద, నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 15,149 వద్ద ట్రేడవుతున్నాయి. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, మ్యాక్స్ ఫైనాన్షియల్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, హింద్కాపర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్లు లాభాల్లో ఉండగా.. ఏషియన్ గ్రానైటో ఇండియా, ఎలాంటస్ బెక్ ఇండియా, ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్, పాలీమెడీ క్యూర్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ పరిణామాలు, ఫిబ్రవరి డెరివేటీవ్స్ ముగింపు వంటి కారణాలతో సూచీలు 1శాతం వరకు లబ్ధిపొందాయి. మ్యాక్స్లైఫ్ ఇన్స్యూరెన్స్లో వాటాల యాక్సెస్ బ్యాంక్కు ఐఆర్డీఏఐ అనుమతి రావడంతో మ్యాక్స్ షేర్లు 12శాతం వరకు పెరిగాయి. నేడు నురేఖ సంస్థ షేర్లు మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఈ కంపెనీ రూ.100 కోట్ల సమీకరణకు ఐపీవోకు రాగా.. 40 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!