ఫిబ్రవరిలో సేవల రంగ పీఎంఐ 55.3
దేశీయ గిరాకీతో భారత సేవల రంగం వరుసగా అయిదో నెలా వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సేవల రంగ వ్యాపార కార్యకలాపాల...
దిల్లీ: దేశీయ గిరాకీతో భారత సేవల రంగం వరుసగా అయిదో నెలా వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సేవల రంగ వ్యాపార కార్యకలాపాల సూచీ 55.3 పాయింట్లుగా నమోదైంది. ఇది జనవరిలో 52.8 పాయింట్లుగా ఉంది. ఈ సూచీ 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధిగా, దిగువన ఉంటే క్షీణతగా భావించాల్సి ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడం, పెరుగుతున్న వ్యాపార ఆశావాదం వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి దోహదం చేశాయని ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వే వెల్లడించింది. ‘భారత సేవల రంగంలో కార్యకలాపాలు మంచి స్థాయికి చేరాయి. సాధారణంగా నాలుగో త్రైమాసికంలో ఇవి పుంజుకుంటుంటాయి. అలాగే మూడో త్రైమాసికంలో సాంకేతిక మాంద్యం నుంచి భారత్ బయటకొచ్చింది. పీఎంఐ గణాంకాలు చూస్తే నాలుగో త్రైమాసికంలోనూ బలమైన వృద్ధి నమోదు చేయగలదనిపిస్తోంద’ని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పాలియానా డె లీమా వెల్లడించారు. తయారీ రంగ పీఎంఐ కూడా జనవరిలో నమోదైన 55.8 పాయింట్లతో పోలిస్తే గత నెలలో 57.3 పాయింట్లకు చేరిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)