ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులకు సిద్ధమవుతున్నారా?
డెట్ పోర్ట్ఫోలియోను వైవిధ్యపరచడానికి ప్రభుత్వ సెక్యూరిటీలు మంచి ఎంపిక
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల “రిటైల్ డైరెక్ట్” అనే ప్లాట్ఫామ్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది, ఇది రిటైల్ పెట్టుబడిదారులకు ప్రభుత్వ సెక్యూరిటీలకు (జి-సెక్యూరిటీలు) ప్రైమరీ, సెకండరీ మార్కెట్లలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్బీఐ జారీ చేసేడెట్ సెక్యూరిటీలు, కొన్ని రోజుల నుంచి 40 సంవత్సరాల వరకు ఇందులో పెట్టుబడులను కొనసాగించవచ్చు. అయితే ఈ పెట్టుబడులపై ఆర్బీఐ మార్గదర్శకాలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు.
ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఆర్బీఐ చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు, కానీ మునుపటితో పోలిస్తే ఇప్పుడు స్పందన చాలా బాగుంది.
మరి ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే ఏంటి అందులో పెట్టుబడులు పెట్టాలా? వద్దా? తెలుసుకుందాం
ప్రభుత్వ సెక్యూరిటీలు ఏమి అందిస్తాయి?
భద్రత: వీటికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది కాబట్టి అవి చాలా సురక్షితం. ఎటువంటి క్రెడిట్ రిస్క్ లేదు. ఏదేమైనా, వడ్డీ రేటు రిస్క్ ఉంటుంది. ఈ సెక్యూరిటీల ధర వడ్డీ రేట్లతో విలోమ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ట్రేడింగ్ చేసినప్పుడు వడ్డీ రేటు కదలిక కారణంగా ధరలో మార్పు వచ్చే ప్రమాదం ఉంది. రేట్లు తగ్గినప్పుడు, దీనికి విరుద్ధంగా ఇది పెరుగుతుంది. రేట్లు పెరిగినప్పుడు ఇవి తగ్గుతాయి. అయితే మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేస్తే రిస్క్ తగ్గించవచ్చు.
పన్ను పరిధి: ప్రభుత్వ సెక్యూరిటీలపై లభించే వడ్డీ పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక సంవత్సరం తరువాత వాటిని అమ్మితే 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణించి తగిన పన్ను విధిస్తారు. మీరు వాటిని ఒక సంవత్సరం కంటే ముందే విక్రయిస్తే మార్జినల్ శ్లాబు రేట్లు వర్తిస్తాయి.
లావాదేవీ: ప్రభుత్వ సెక్యూరిటీల వేలంలో రిటైల్ పెట్టుబడుదారులు పాల్గొనడానికి ప్రభుత్వం ఇంతకుముందు అనుమతించింది. పెట్టుబడిదారులు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ “ఎన్ఎస్ఈ గోబిడ్” , “బిఎస్ఈ డైరెక్ట్” ప్లాట్ఫాంల ద్వారా ఈ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులను (టి-బిల్లులు) కొనుగోలు చేయవచ్చు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో పెట్టుబడిదారులు వేలంలో పాల్గొనడానికి ప్రత్యేక ఖాతాలను తెరవవలసిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న వారి బ్రోకింగ్ ఖాతాల ద్వారా లావాదేవీలు చేయవచ్చు.
రిటైల్ పెట్టుబడిదారులు ఆర్బీఐ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఏదేమైనా దీనిపై అవగాహన తక్కువగా ఉండటంతో పాటు ద్రవ్యత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ హోల్సేల్ లాట్లలో ఉదాహరణకు రూ. 5 కోట్లలో వర్తకం చేస్తుంది, రిటైల్ లాట్లలో కాదు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్లాట్ఫామ్లలో (ఎన్ఎస్ఇ గోబిడ్ వంటివి) కూడా, లిక్విడిటీ ఉండదు, ఎందుకంటే మీరు రిటైల్లో కొనుగోలు మాత్రమే చేయవచ్చు, కానీ అమ్మకూడదు. ఇందులో రిటైల్ పెట్టుబడిదారులకు చాలా ఆప్షన్లు చాలా తక్కువ. అందువల్ల, ప్రభుత్వ సెక్యురిటీల్లో పెట్టుబడి రిటైల్ పెట్టుబడిదారుల కోసం అంతగా ప్రాచుర్యం పొందలేదు.
కొత్త ప్లాట్ఫామ్ ద్వారా ద్రవ్యత, పెట్టుబడుల సౌలభ్యాన్ని ఆర్బిఐ పరిష్కరించగలిగితే అందరకీ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.
పెట్టుబడి పెట్టాలా? వద్దా?
పదవీవిరమణ చేసిన వ్యక్తికి లేదా దీర్ఘకాలికంగా క్రమంగా వడ్డీని పొందడానికి దీర్ఘకాలికంగా సురక్షితంగా డబ్బును పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వారికి ప్రభుత్వ సెక్యూరిటీలు మంచి ప్రత్యామ్నాయం. అదేవిధంగా వైవిధ్యీకరణ, భద్రత కోసం చూస్తున్నవారికి కూడా ఇవి మంచివి అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే, రిటైల్ విభాగంలో లిక్విడిటీ లేకపోవడం వల్ల మీరు దానిని మెచ్యూరిటీ వరకు కొనసాగించాలని ఆలోచిస్తున్నట్లయితే మాత్రమే ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడం మంచిదని చెప్తున్నారు.
అలాగే, రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ ఇతర పెట్టుబడులతో చూస్తే రాబడి కూడా తక్కువగా ఉంటుంది. 10 సంవత్సరాల బెంచ్మార్క్ ప్రభుత్వ సెక్యూరిటీలు ప్రస్తుతం 6.1 శాతం రాబడిని అందిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల