డౌన్ పేమెంట్ కోసం పీపీఎఫ్ ఖాతా తెరుద్దామా?
పీపీఎఫ్ ఖాతా నియమ నిబంధనల ప్రకారం నిల్వలో నుంచి 50 శాతం మాత్రమే తీసుకునే అవకాశం ఉంది
ఇల్లు కొనుగోలు అనేది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి. ప్రస్తుత రోజులలో బ్యాంకులు ఇంటి విలువలో 80-85 శాతం వరకు రుణం మంజూరు చేస్తున్నాయి. అయితే, ఇళ్ల ధరలు కూడా పెరగడంతో కనీసం చెల్లించాల్సిన డౌన్ పేమెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీర్ఘ కాలం మదుపు చేయడం వలన చక్రవడ్డీ ప్రభావంతో అధిక రాబడి పొందవచ్చు. దీని కోసం ముందు నుంచే మదుపు ప్రారంభించాలి. ఇంటి కొనుగోలుకు కావలసిన డౌన్ పేమెంట్ కొరకు ఏ పధకాలను ఎంచుకోవచ్చో చూద్దాం.
ఉదా: 30 ఏళ్ళ రామ్, పది సంవత్సరాల తర్వాత ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాడు. దీని ప్రస్తుత విలువ రూ 40 లక్షలు. దీనిపై ద్రవ్యోల్బణ ప్రభావం 7 శాతం అనుకుంటే, పది సంవత్సరాల తరువాత దీని విలువ రూ 80 లక్షల వరకు ఉంటుంది. అందులో 20శాతం డౌన్ పేమెంట్ గా రూ. 15 లక్షలు , మిగిలిన మొత్తాన్ని గృహ రుణం ద్వారా పొందవచ్చు. ఇప్పటినుంచి నెల నెలా మదుపు మొదలుపెట్టి డౌన్ పేమెంట్ కు ఏర్పాటు చేసుకోవాలి.
పీపీఎఫ్:
రామ్, డిసెంబర్ నుంచి 2018 లో పీపీఎఫ్ ఖాతా తెరిచాడు. 2019-20 సంవత్సరం నుంచి మొదటి ఐదు సంవత్సరాలకు ప్రతి నెలా రూ.12,500 ( ఏడాదికి రూ.1.50 లక్షలు) , తరువాతి ఐదు సంవత్సరాలకు నెలకు రూ 16,670 ( ఏడాదికి రూ 2 లక్షలు), ఆ తరువాతి ఐదు సంవత్సరాలకు నెలలు రూ 20,830 (ఏడాదికి రూ 2.50 లక్షలు) జమచేస్తూ వస్తే, పది సంవత్సరాలకు 8శాతం అంచనా వడ్డీతో 2028-29 నాటికి రూ. 26.1 లక్షలు జమ అవుతాయి . అయితే పీపీఎఫ్ ఖాతా నియమ నిబంధనల ప్రకారం నాలుగు సంవత్సరాల ముందు ఉన్న నిల్వ లేదా క్రితం సంవత్సరం మార్చి నాటికి ఉన్న నిల్వలో ఏది తక్కువైతే, దాని నుంచి 50 శాతం మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అందువలన, రామ్ 2025-26 చివరి నాటికి ఉన్న రూ 15 లక్షలలో 50 శాతం అనగా రూ 7.5 లక్షలు మాత్రమే పొందగలడు. మిగిలిన రూ 7. 5 లక్షలను జమ చేయటానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవవచ్చు. ప్రస్తుత త్రైమాసికానికి పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్:
వీటిలో అనేక పథకాలు ఉంటాయి. స్వల్ప కాలంలో ఈక్విటీలు ఒడుదుడుకులకి లోనైనా, దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. ముందుగా యుటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లాంటి ఒక ఇండెక్స్ ఫండ్ లో మొదలుపెట్టి, ప్రతి సంవత్సరం మదుపు పెంచుకుంటూ ఉండాలి. ఉదా: నెలకు రూ 2,500 లతో (ఏడాదికి రూ 30 వేలు) మొదలుపెట్టి, ప్రతి సంవత్సరం పది శాతం పెంచుకుంటూ మదుపు చేస్తే, దీర్ఘకాలంలో 12 శాతం రాబడి అంచనాతో పది సంవత్సరాల తరువాత రూ 7.5 లక్షలను పొందవచ్చు. రిస్క్ తీసుకోలేని వారు మ్యూచువల్ ఫండ్ల బదులు పీపీఎఫ్ ని ఎంచుకోవచ్చు
పీపీఎఫ్ ఖాతా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లను ఉపయోగించి హోమ్ లోన్ ఈఎంఐ ని ఎలా చెల్లించవచ్చో తెలుసుకున్నాం. ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు లను పెంచుతుందని అంచనా వేయడమైంది.
ప్రతి ఒక్కరూ వారి ఆర్ధిక లక్ష్యాలను గుర్తించి, తగిన మదుపు పథకాలను ఎంచుకోవడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చు. మనం చేసే ప్రతి పెట్టుబడి ముందు భద్రత, సమయానికి చేతికి సొమ్ము అందడం (లిక్విడిటీ) , రాబడి, ఆర్ధిక లక్ష్యం చేరుకోటానికి ఉన్న సమయం, మన రిస్క్ సామర్ధ్యం, పన్ను ప్రభావం వంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM