పీపీఎఫ్తో నిజమైన దీపావళి
ఏడాదికి రూ.1,50,000 పీపీఎఫ్ పెట్టుబడులతో 15 సంవత్సరాలకు రూ.46,75,910 సంపాదించవచ్చు.......
ఏడాదికి రూ.1,50,000 పీపీఎఫ్ పెట్టుబడులతో 15 సంవత్సరాలకు రూ.46,75,910 సంపాదించవచ్చు.
దీపావళికి పెట్టుబడులు ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలోకి లక్మీదేవీని ఆహ్వానించినట్లే. పెట్టుబడుల నిర్ణయంతో మీ ఇంట్లో ఎప్పటికీ వెలుగులు విరజిమ్ముతాయి. జీవితం కాంతివంతమవుతుంది. అందుకే లక్ష్మీపూజ చేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వనించాలని ఆకాంక్షిస్తన్నారు ఆర్థిక నిపుణులు. భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడుల సాధనాలను ఎంచుకోవాలి. ఉదాహరణకు పీపీఎఫ్లో పెట్టుబడులు ప్రారంభించాలనుకుంటే ఎంత పెట్టుబడి చేస్తే ఎంత లాభం పొందవచ్చో తెలుసుకుందాం.
ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)
ఈ దీపావళికి మీరు తీసుకునే ఒక నిర్ణయంతో లక్ష నుంచి కోటి రూపాయల వరకు సంపాదించవచ్చు. అయితే అంత మొత్తం ఒకేసారి సంపాదించడం సాధ్యం కాదు. మంచి ప్రణాళికతో 15 సంవత్సరాలు పీపీఎఫ్ పెట్టుబడులు కొనసాగిస్తే సంపాదించవచ్చు. దీనిపై చెప్పుకోవదగ్గ రాబడితోపాటు, ఆదాయ పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. మీ డబ్బు సురక్షితంగా కూడా ఉంటుంది.
పీపీఎఫ్ ఖాతాను మీ బ్యాంకు అధికారిక వెబ్సైట్ ద్వారా సులభంగా ప్రారంభించవచ్చు. వ్యక్తులు పీపీఎఫ్ ఖాతాను తమ కోసం లేదా తమ మీద ఆదారపడిన మైనర్లు కోసం ప్రారంభించవచ్చు. అంటే ఇది మీ పిల్లలకు 15 సంవత్సరాల తర్వాత ఇచ్చే విలువైన బహుమతిగా కూడా చెప్పుకోవచ్చు. దీనిపై కొన్ని సంవత్సరాల తర్వాత రుణం కూడా పొందవచ్చన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం పీపీఎఫ్పై 8.1 శాతం వడ్డీ రేట్లు లభిస్తోంది. మీరు ఇప్పుడు పెట్టుబడులు ప్రారంభిస్తే 15 సంవత్సరాల తర్వాత రెట్టింపు లాభం పొందవచ్చు. ఈ దీపావళికి మీరు పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించాలనుకుంటే ముందు ఎంత మొత్తం పెట్టుబడి చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఏడాదికి రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. లాక్-ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు ముగిసేవరకు ఏడాదికి ఎంత చొప్పున పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో లెక్కించుకోండి.
సంవత్సరానికి గరిష్ఠంగా ఎంత పెట్టుబడులు పెడితే ఎంత లాభం పొందవచ్చో ఇప్పుడు చూద్దాం
ఏడాదికి రూ. 1.5 లక్షలు అయితే 15 సంవత్సరాలకి రూ.46,75,910
- రూ.లక్ష- 15 ఏళ్లకి రూ.31,17,278
- రూ.50 వేలు- రూ.15,58,634
- రూ.25 వేలు-రూ.7,79,319
- రూ.10 వేలు-రూ.3,11,730
- రూ.5 వేలు-రూ.1,55,867
- రూ.1000-రూ.31,173
పీపీఎఫ్ పెట్టుబడులు 15 సంవత్సరాల తర్వాత ఇంకొంత కాలం కొనసాగించాలనుకుంటే మరో 5 ఏళ్ల చొప్పున కొనసాగిస్తూ పోవచ్చు. అయితే మీరు 25 సంవత్సరాల వరకు పెట్టుబడులు కొనసాగించాలనుకుంటే సంవత్సరానికి రూ.1,50,000 డిపాజిట్ చేస్తే రూ. కోటి రూపాయవల వరకు కూడా సంపాదించవచ్చు. పీపీఎఫ్కి నామినేషన్ సదుపాయం కూడా ఉంటుంది. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా ప్రకటించవచ్చు. ఎవరికి ఎంత చెందాలన్నది కూడా ఖాతాదారుడి నిర్ణయంపై ఆదారపడి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా