ఎప్పుడైనా మదుపు కొనసాగించండి
మార్కెట్ ల హెచ్చుతగ్గులప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి....
మార్కెట్ ల హెచ్చుతగ్గులప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి
మీ ఆర్ధిక లక్ష్యాలు, రిస్క్ సామర్ధ్యం గుర్తుంచుకోండి . మిగులు డబ్బు , దీర్ఘకాలం మదుపు చేయగలిగితే , కొద్ది కొద్ది గా మదుపు చేయండి. కరోనా వైరస్ వలన ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలు, స్టాక్ మార్కెట్ లు కుదేలవుతున్నాయి . చాలా రేటింగ్ ఏజెన్సీ లు ప్రపంచ దేశాల జిడిపీ లలో తగ్గుదలను అంచనా వేస్తున్నాయి. అతి తక్కువ కు పడిపోయిన ముడిచమురు ధరలు కూడా ఉదాహరణ. కరోనా ప్రభావం మనదేశ ఆర్ధిక వ్యవస్థపై కూడా వుంది . వారెన్ బఫెట్ చేస్తున్నదే చెప్పినట్లు , ఇతరులు మార్కెట్ ల నుంచి వైదొలుగుతున్నప్పుడు , మనం మదుపు చేయాలి. ఇప్పటికే పడిపోయిన మార్కెట్ లలో మదుపు చేయడం కొంచెం భయమే, ఎందుకంటే మళ్ళీ రేపు పడిపోవచ్చు.
మార్కెట్ సంక్షోభం :
ఇటువంటి సంక్షోభాలు అరుదు. ప్రజలు ఇంటికే పరిమితమవ్వడం, ప్రయాణాల నిషేధం వలన ఆర్ధిక పరిస్థితి సంక్షోభంలో ఉంది. ఇటువంటి సమయాలలో మదుపు చేసే విషయంలో భావొద్వేలగాలను అదుపులో ఉంచుకోవాలి.
ఇటువంటి సందర్భాలలో గుర్తుంచుకోవలసిన విషయాలు:
మదుపు చేస్తున్నాం కానీ, జూదం ఆడట్లేదు . మీ ఆర్ధిక లక్ష్యాలు, రిస్క్ సామర్ధ్యం చూడాలి కానీ కేవలం మార్కెట్ లు పడుతున్నాయని కాదు. స్టాక్ చౌకగా లభిస్తోందంటే నాణ్యమైనదని కాదు,అధిక ధరకు ఉందంటే నాణ్యత లేనిదాని కాదు. మార్కెట్ ల హెచ్చుతగ్గులప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి .
ఆర్ధిక లక్ష్యాలపై దృష్టి ఉంచాలి :
ఆర్ధిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, మిగులు డబ్బు ఉండి, దీర్ఘకాలంపాటు మదుపు చేయగలిగితే , కొద్ది కొద్ది మొత్తాలలో మదుపు చేయాలి. ఒక్కక్క సారి తాత్కాలికంగా లాభాలు వచ్చినట్లు అనిపించినా, దీర్ఘకాలమే లక్ష్యం కావాలి. 2008 నాటి పరిస్థితి గుర్తు తెచ్చుకోండి. అది ఒక ఆర్ధిక సంక్షోభం. తిరిగి 9 నెలలలో కోలుకుంది. కానీ ప్రస్తుత సమస్య ఆరోగ్యం. ఎప్పటిలోగా ఈ సమస్య తీరుతుందో తెలియదు. అందుచేత ఎటువంటి తొందరపాటు చర్యలతో కాకుండా , దీర్ఘకాలం కోసం మదుపు కొనసాగించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్