Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దిగ్గజ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దిగ్గజ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడుదొడుకుల్లో సాగిన సూచీలు చివరకు లాభాలను దక్కించుకోగలిగాయి.
ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అయితే బ్యాంకింగ్, రియల్టీ రంగాల్లో ఎదురైన ఒత్తిడితో కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీలు రోజంతా ఊగిసలాడుతూనే ఉన్నాయి. 58,831 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ ఒక దశలో 58,340 పాయింట్లకు పడిపోయింది. అయితే మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకున్న సూచీ చివరకు 157 పాయింట్ల లాభంతో 58,807 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 47 పాయింట్ల స్వల్ప లాభంతో 17,517 వద్ద ముగిసింది.
ముఖ్యంగా బ్యాంకింగ్, రియల్టీ, లోహ రంగ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఎన్ఎస్ఈలో ఐటీసీ, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభపడగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!