Gold: సగం బంగారం ఆ దేశం నుంచే వస్తోంది!
భారత్ దిగుమతి చేసుకొంటున్న బంగారంలో దాదాపు సగం ఒకే దేశం నుంచి వస్తోంది. 2020-21 లెక్కల ప్రకారం భారత్ మొత్తం 34.6 బిలియన్ డాలర్లు విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోంది. దీనిలో 16.3 బిలియన్
ఇంటర్నెట్డెస్క్: భారత్ దిగుమతి చేసుకొంటున్న బంగారంలో దాదాపు సగం ఒకే దేశం నుంచి వస్తోంది. 2020-21 లెక్కల ప్రకారం భారత్ మొత్తం 34.6 బిలియన్ డాలర్లు విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోంది. దీనిలో 16.3 బిలియన్ డాలర్ల పుత్తడి స్విట్జర్లాండ్ నుంచే వచ్చింది. కరోనా రాక ముందు ఏడాది కంటే 2020-21లో భారత్ 6.4 బిలియన్ డాలర్లు అధికంగా దిగుమతి చేసుకొంది. ఇక స్విట్జర్లాండ్ నుంచి దిగుమతులు కూడా 7.8శాతం 18.2 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో భారత్కు నాలుగో అతిపెద్ద దిగుమతిదారుగా అవతరించింది. గతంలో ఆ స్థానంలో సౌదీ అరేబియా ఉండేది. ఇక చైనా నుంచి దిగుమతుల్లో 0.07శాతం తగ్గుదల నమోదై 65.21 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తం(అన్నిరకాల వస్తుసేవల) దిగుమతుల్లో ఇప్పటికీ అత్యధిక వాటా చైనాదే. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, యూఏఈ ఉన్నాయి. బంగారం వినియోగదారుల్లో ప్రపంచలోనే చైనా తర్వాతి స్థానంలో భారత్ ఉంది.
స్విట్జర్లాండ్ ప్రపంచలోనే అతిపెద్ద బంగారం శుద్ధికేంద్రం. ఇక్కడ అత్యున్నత శ్రేణి పుత్తడి లభిస్తుంది. దీంతో స్వర్ణ ప్రియులు స్విట్జర్లాండ్కే వైపే మొగ్గుతున్నారు. అంతేకాదు.. అది పెద్ద రవాణ హబ్ కూడా. బంగారంపై పన్నును కూడా 12.5శాతం నుంచి 10శాతానికి తగ్గించింది. అందుకే కొంతకాలంగా అక్కడి నుంచి దిగుమతులు పెరుగుతున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. గతేడాది యూఏఈ నుంచి 4.19 బిలియన్ డాలర్లు, దక్షిణాఫ్రికా నుంచి 2.5 బిలియన్ డాలర్ల విలువైన పుత్తడిని కొనుగోలు చేశాము.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు