సుప్రీం తీర్పునకు తగ్గట్లు చర్యలు చేపట్టండి
ప్రతిపాదిత రూ.24,713 కోట్ల ఫ్యూచర్-రిటైల్ ఒప్పందానికి సంబంధించి జారీ చేసిన ‘నిరభ్యంతర పత్రాల’ను తక్షణం ఉపసంహరించుకోవాలని స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆదేశాలు జారీ చేయాలని సెబీకి అమెజాన్ లేఖ రాసింది.
సెబీకి అమెజాన్ విజ్ఞప్తి
దిల్లీ: ప్రతిపాదిత రూ.24,713 కోట్ల ఫ్యూచర్-రిటైల్ ఒప్పందానికి సంబంధించి జారీ చేసిన ‘నిరభ్యంతర పత్రాల’ను తక్షణం ఉపసంహరించుకోవాలని స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆదేశాలు జారీ చేయాలని సెబీకి అమెజాన్ లేఖ రాసింది. అదే సమయంలో ఈ ఒప్పందానికి సంబంధించి తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు తగ్గట్లుగా సరైన చర్యలు చేపట్టాలని కూడా సెబీని కోరింది. కాగా, ఈ అంశంపై మాట్లాడడానికి అమెజాన్ నిరాకరించగా.. ఫ్యూచర్ గ్రూప్నకు పంపిన ఇ-మెయిళ్లకు స్పందన రాలేదు. ఫ్యూచర్ గ్రూప్ తన ఆస్తుల విక్రయాలను రిలయన్స్కు విక్రయించాలన్న ప్రతిపాదనకు ఈ ఏడాది జనవరిలో సెబీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఒప్పందానికి బీఎస్ఈ ఎటువంటి ప్రతికూల పరిశీలనలూ లేవంటూ లేఖను జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిపైనే అమెజాన్ ఇపుడు సెబీకి లేఖ రాసింది.
ముంబయితో పాటు ఇతర నగరాల్లోనూ పెట్టాలి
డేటాకేంద్రాలతో అధిక విద్యుత్ వినియోగం
మైక్రోసాఫ్ట్ ప్రతినిధి రాహుల్
ముంబయి: అంతర్జాతీయంగా పెద్ద నగరాలైన ఆమ్స్టర్డామ్, సింగపూర్ వంటివి కొత్త డేటా కేంద్రాలకు దూరంగా ఉంటున్నాయి. అవి వినియోగించే అధిక విద్యుతే అందుకు కారణం. ఈ నేపథ్యంలో భారత్ కూడా ముంబయిలోనే అన్ని కేంద్రాలనూ ఏర్పాటు చేయడం తగదని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి రాహుల్ ధార్ అంటున్నారు. ముంబయి లేదా దిల్లీ లేదా చెన్నై అంటూ ఒకే నగరానికి పరిమితం చేయకుండా అన్ని నగరాల్లోనూ డేటాకేంద్రాల వికేంద్రీకరణ చేయాలని సూచించారు. ‘మొత్తం నగరానికి ఇవ్వాల్సిన విద్యుత్నంతా డేటాకేంద్రాలే లాగేసుకుంటాయి. అందుకే సింగపూర్ వంటి అత్యాధునిక నగరం కూడా కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. అంతర్జాతీయ అనుభవాల నుంచి భారత్ నేర్చుకోవాలి’ అని సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో ఆయన పేర్కొన్నారు. సిఫీ టెక్నాలజీస్కు చెందిన కమల్నాథ్ మాట్లాడుతూ దేశంలోనే తన తొలి డేటాకేంద్రాన్ని వశీ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలోని మొత్తం డేటా కేంద్రాల సామర్థ్యం(240 మెగావాట్)లో సగం ముంబయిలోనే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?