
Tata Motors Price Hike: పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఎప్పుడంటే?
దిల్లీ: తమ వాహన ధరలను సగటున 0.9 శాతం మేర పెంచనున్నట్లు ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రకటించింది. కొత్త ధరలు ఈనెల 19 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ముడిపదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. జనవరి 18, 2022కి ముందు బుక్ చేసుకున్న కార్లకు ధరల పెంపు వర్తించదని స్పష్టం చేసింది. మరోవైపు వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా కొన్ని నిర్దిష్ట వేరియంట్ల ధరలను రూ.10,000 వరకు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
మారుతీ సుజుకీ సైతం తమ వాహన ధరలను 0.1-4.3 శాతం మేర పెంచినట్లు ఇటీవలే ప్రకటించింది. కొత్త ధరలు ఈనెల 15 నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.