Apple: యాపిల్ స్టోర్ వర్కర్లకు రూ.223 కోట్ల పరిహారం
యాపిల్ స్టోర్లలో పనిచేసే తమ ఉద్యోగులకు 29.9 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.223 కోట్లు) చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది....
కాలిఫోర్నియా: యాపిల్ స్టోర్లలో పనిచేసే తమ ఉద్యోగులకు 29.9 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.223 కోట్లు) చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది. 2013 నుంచి కోర్టులో ఉన్న ఓ వ్యవహారం కొలిక్కి రావడంతో ఉద్యోగులకు ఈ పరిహారం లభించనుంది.
యాపిల్ స్టోర్లలో తమ విధులను ముగించుకొని వెళ్లే ముందు ఉద్యోగులను క్షుణ్నంగా తనిఖీ చేసేవారు. వారేమైనా బ్యాగుల వంటివి తెచ్చుకుంటే వాటిని కూడా నిశితంగా పరిశీలించేవారు. అయితే, పెద్ద మొత్తంలో ఉద్యోగులు ఉన్న స్టోర్ల వద్ద ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టేది. కంపెనీ మాత్రం ఈ తనిఖీ సమయాన్ని వారి పనిగంటల్లో చేర్చేది కాదు. దీనిపై గళం విప్పిన ఉద్యోగులు 2013లో కోర్టును ఆశ్రయించారు. తనిఖీ సమయానికి కూడా తమకు వేతనం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాలిఫోర్నియాలోని నిబంధనల ప్రకారం ఇది చట్టవిరుద్ధమని వాదించారు.
వర్కర్లు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ఇతర సామాన్లు దాచిపెట్టుకొని వెళ్లట్లేదని నిర్దారించడం కోసం తనిఖీలు తప్పవని యాపిల్ వాదించింది. ఈ తనిఖీలు అవసరం లేదనుకునేవారు బ్యాగులు తీసుకురావొద్దని ఆదేశించినట్లు తెలిపింది. 2015లో ఓ న్యాయస్థానం ఉద్యోగుల వ్యాజ్యాన్ని కొట్టివేసింది. కానీ, వారు మరోసారి కోర్టును ఆశ్రయించడంతో న్యాయం లభించింది.
కాలిఫోర్నియాలో మొత్తం 52 యాపిల్ స్టోర్లు ఉన్నాయి. వీటిలో 14,683 మంది పనిచేస్తున్నారు. కోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో కేవలం వీరి గురించి మాత్రమే ప్రస్తావించారు. దీంతో యాపిల్ తాజాగా ఇవ్వడానికి అంగీకరించిన పరిహారం కేవలం వీరికి మాత్రమే అందనుంది. ఒక్కో ఉద్యోగి 1,286 డాలర్ల వరకు పొందే అవకాశం ఉంది.
► Read latest Business News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం