
Stock Market Closing Bell: ఆర్బీఐ అండతో బుల్ జోరు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంచనున్నామన్న ఆర్బీఐ ప్రకటనతో సూచీలు పైకి పరుగులు తీశాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న సానుకూల సంకేతాలు మరింత బలాన్నిచ్చాయి. అలాగే దేశీయంగా దాదాపు అన్ని రంగాలు రాణించడం, దిగ్గజ కంపెనీ షేర్లు పరుగులు తీయడం సెంటిమెంటును పెంచింది. మరోవైపు కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతపై ఆందోళనలు తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడంతో.. సెన్సెక్స్, నిఫ్టీ అదే బాటలో నడిచాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి.
ఉదయం సెన్సెక్స్ 58,158.56 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,702.65 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1,016.03 పాయింట్ల లాభంతో 58,649.68 వద్ద ముగిసింది. 17,315.25 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 17,484.60 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 291.65 పాయింట్లు లాభపడి 17,468.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.44 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో కొటాక్ మహీంద్రా బ్యాంక్, పవర్గ్రిడ్ మినహా మిగిలినవన్నీ లాభపడ్డాయి. బజాజ్ ఫినాన్స్, మారుతీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ఫార్మా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు రాణించిన వాటిలో ఉన్నాయి.
► Read latest Business News and Telugu News
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
-
Ap-top-news News
Botsa: అందుకే నాకు భయమేస్తోంది: బొత్స
-
Ap-top-news News
Raghurama: రఘురామను హైదరాబాద్లోనే విచారించండి: ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Andhra News: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం.. ఐదుగురు సజీవదహనం
-
Ap-top-news News
Andhra News: ఉద్యోగినిపై చెయ్యి ఎత్తిన అధికారి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: కథ మారింది..!
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం