Stock market: ఆరంభ లాభాలు ఆవిరి.. నష్టాల్లో ముగిసిన సూచీలు!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ఊగిసలాట మధ్య ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే పూర్తి లాభాల్లోకి ప్రవేశించాయి. చివరి గంట వరకు అదే బాటలో పయనించాయి....
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ఊగిసలాట మధ్య ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే పూర్తి లాభాల్లోకి ప్రవేశించాయి. చివరి గంట వరకు అదే బాటలో పయనించాయి. కానీ, ఇంట్రాడే గరిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు కిందకు వచ్చాయి. ముఖ్యంగా రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, టైటన్ వంటి దిగ్గజ షేర్లు కుంగడం సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సైతం మిశ్రమంగానే ట్రేడవుతున్నాయి.
ఉదయం సెన్సెక్స్ 58,839.32 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,968.12 - 58,143.44 మధ్య కదలాడింది. చివరకు 324.34 పాయింట్ల నష్టంతో 58,340.99 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 17,423.55 వద్ద కనిష్ఠాన్ని, 17,600.60 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 77.10 పాయింట్లు నష్టపోయి 17,426.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.39 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో 24 షేర్లు నష్టపోయాయి. అత్యధికంగా నష్టపోయిన వాటిలో మారుతీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో షేర్లు ఉన్నాయి. ఎన్టీపీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్గ్రిడ్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టపోయాయి.
► Read latest Business News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట