Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు!

అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.....

Updated : 30 Nov 2021 09:39 IST

ముంబయి: అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్‌ను ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించినా, దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఈ రకం వైరస్‌ సోకిన వారిలో ఇప్పటి వరకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలపడంతో మార్కెట్లలో నెలకొన్న భయాలు తాత్కాలికంగా తొలగినట్లే కనిపిస్తున్నాయి. నేడు స్టార్‌ హెల్త్‌ ఐపీఓ ప్రారంభం కానుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 388 పాయింట్ల లాభంతో 57,649 వద్ద.. నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 17,171 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.95 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫినాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ మాత్రమే 0.20 శాతం నష్టాల్లో ఉంది.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు