Stock market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు సోమవారం భారీ నష్టాలు చవిచూశాయి....
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలు చవిచూశాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు మార్కెట్లలో అప్రమత్తతను సృష్టిస్తున్నాయి. అయితే, ఇప్పటికే రెండు దశల కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వాలు మహమ్మారి కట్టడికి సన్నద్ధంగా ఉన్నాయన్న సంకేతాలు మదుపర్లలో కొంత విశ్వాసం నింపుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 623 పాయింట్ల లాభంతో 57,688 వద్ద.. నిఫ్టీ 195 పాయింట్ల లాభంతో 17,178 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.97 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్గ్రిడ్ మాత్రమే నష్టాల్లో ఉంది. రాణిస్తున్న వాటిలో ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, మారుతీ, రిలయన్స్ షేర్లు ఉన్నాయి.
► Read latest Business News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ