Stock market: మార్కెట్లపై కొనసాగుతున్న బేర్ పట్టు!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపై బేర్ పట్టు కొనసాగుతోంది. మంగళవారం కూడా సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి....
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపై బేర్ పట్టు కొనసాగుతోంది. మంగళవారం కూడా సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయంగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంటుండడం, సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడం వంటి కీలక నిర్ణయాలు మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. మరోవైపు సోమవారం ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలిచారు. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ వంటి దిగ్గజ షేర్లు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్ 641 పాయింట్ల నష్టంతో 57,823 వద్ద.. నిఫ్టీ 176 పాయింట్ల నష్టంతో 17,239 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.50 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, పవర్గ్రిడ్, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫినాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. రంగాల వారీగా చూస్తే టెలికాం, బేసిక్ మెటీరియల్స్ రాణిస్తున్నాయి.
► Read latest Business News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు