Paytm IPO: 18న కోటీశ్వరులుగా మారనున్న 350 మంది!
దీంతో నవంబరు 18న స్టాక్ మార్కెట్లో లిస్టయిన వెంటనే భారత్లో దాదాపు 350 మంది కోటీశ్వరులుగా మారనున్నారు....
పేటీఎం ఐపీఓ లిస్టింగ్తో భారీగా లాభపడనున్న ఉద్యోగులు
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అతిపెద్ద ఐపీఓగా పేటీఎం పబ్లిక్ ఇష్యూ నిలిచింది. రూ.18,300 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా నవంబరు 8న ప్రారంభమైన ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ 10న ముగిసింది. 18న స్టాక్ మార్కెట్ సూచీల్లో నమోదు కానుంది. ఒక్కో షేరుకు రూ.2,150కు కేటాయించారు. దీంతో నవంబరు 18న స్టాక్ మార్కెట్లో లిస్టయిన వెంటనే భారత్లో దాదాపు 350 మంది కోటీశ్వరులుగా మారనున్నారు.
పేటీఎంలో గతంలో పనిచేసిన, ప్రస్తుతం ఉద్యోగులుగా ఉన్న దాదాపు 350 మంది నవంబరు 18న కోటీశ్వరులుగా అవతరించనున్నారు. వీరిలో చాలా మందికి పేటీఎంలో భారీ ఎత్తున షేర్లు ఉండడమే అందుకు కారణం. కంపెనీ కేటాయించిన రూ.2,150ల లెక్కన వీరి సంపద విలువ రూ.1 కోటి దాటనుంది.
ఈ సందర్భంగా గతంలో పేటీఎంలో పనిచేసిన సిద్ధార్థ్ పాండే అనే ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ ఆయన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘పేటీఎంలో పనిచేస్తున్నానని తెలిసి మా నాన్న చాలా నిరాశ చెందారు. ఏంటీ ‘పేటైమ్’ అని అసహనం వ్యక్తం చేశారు. కానీ, ఆయన ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. పైగా ఇప్పుడు దానిలోనే ఉండిపో అని కూడా చెబుతున్నారు’’ అని తెలిపారు. కానీ, పాండే ప్రస్తుతం పేటీఎంని వదిలేసి మరో అంకుర సంస్థలో పనిచేస్తున్నారు. సిద్ధార్థ్ పాండే వంటివారు దాదాపు 350 మంది వరకు ఉన్నారు.
► Read latest Business News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!