Elon Musk: రూ.10 వేల కోట్ల ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించిన మస్క్!
ఫ్యాక్టరీ నిర్మాణానికి సాయం చేస్తామని ప్రభుత్వమే ముందుకు వచ్చినా.. ఎలాన్ మస్క్ మాత్రం దాన్ని తిరస్కరించారు....
వాషింగ్టన్: కంపెనీలను స్థాపిస్తామంటే ఆయా ప్రభుత్వాలు రాయితీలు ఇస్తుంటాయి. సంస్థలు సైతం వాటిని ఆనందంగా స్వీకరిస్తాయి. కొన్ని కంపెనీలైతే.. ప్రభుత్వ సాయం కోసం అర్జీ పెట్టుకుంటాయి. కానీ, ఎలాన్ మస్క్ మాత్రం ఇందుకు భిన్నం. ఫ్యాక్టరీ నిర్మాణానికి సాయం చేస్తామని ప్రభుత్వమే ముందుకు వచ్చినా.. ఆయన మాత్రం దాన్ని తిరస్కరించారు.
జర్మనీ రాజధాని బెర్లిన్కు సమీపంలో ఉన్న బ్రాండెన్బర్గ్లో బ్యాటరీ తయారీ సంస్థను నెలకొల్పాలని టెస్లా నిర్ణయించింది. దీనికి ప్రభుత్వం తరఫున 1.28 బిలియన్ డాలర్ల సాయం అందజేయాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించింది. చైనా నుంచి దిగుమతులు తగ్గించి స్థానికంగా బ్యాటరీల తయారీని ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతోనే ఈయూ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, ఎలాన్ మస్క్ మాత్రం దాన్ని తిరస్కరించారు. ఈ మేరకు సాయం కోసం ఇటీవల స్థానిక టెస్లా అధికారులు ప్రభుత్వానికి పెట్టుకున్న దరఖాస్తును వెనక్కి తీసుకున్నారు. దీనివల్ల టెస్లా బ్యాటరీ కర్మాగార నిర్మాణ పనులపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.
రాయితీలన్నింటినీ ఎత్తివేయాలన్నది టెస్లా నిర్ణయమని మస్క్ ట్విటర్ వేదికగా తెలిపారు. చమురు, గ్యాస్పై కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. కానీ, కొన్ని కారణాల వల్ల ప్రభుత్వాలు అందుకు సిద్ధంగా లేవని వ్యాఖ్యానించారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి టెస్లా 5 బిలియన్ యూరోలు వెచ్చిస్తోంది. బ్యాటరీతో పాటు కార్ల తయారీ సంస్థను కూడా నిర్మిస్తున్నట్లు టెస్లా వర్గాలు తెలిపాయి.
మరోవైపు నవంబరు 2020లోనూ సాయం కోసం బ్రాండెన్బర్గ్ స్థానిక పాలనా సంస్థకు టెస్లా దరఖాస్తు చేసుకుంది. దాన్ని మాత్రం ఇంకా వెనక్కి తీసుకోలేదని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?