నేడు ప్రారంభ‌మైన‌ ప‌దో విడ‌త ప‌సిడి బాండ్ల జారీ

ఈ సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌ను భారత ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ జారీ చేస్తుంది

Published : 11 Jan 2021 12:03 IST

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ప‌దో ద‌శ‌ సార్వ‌భౌమ ప‌స‌డి బాండ్ల జారీ  నేడు జ‌న‌వ‌రి 11 న ప్రారంభ‌మైంది. జనవరి 15న‌ శుక్రవారం ఇష్యూ ముగుస్తుంది.  గ్రాము ధ‌ర రూ. 5,104 గా నిర్ణయించారు. ఆన్‌లైన్ లో కొనుగోలు  చేస్తే రూ. 50 ప్రత్యేక తగ్గింపు ఉంటుంది. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే రిటైల్ పెట్టుబ‌డుదారుల‌కు ఇది ఉత్తమమైన మార్గమని నిపుణులు అభిప్రాయం. దీనిలో రెండుర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై సంవత్సరానికి 2.5% స్థిర వడ్డీని పొందడంతో పాటు, బంగారం ధ‌ర పెరిగితే ఆ లాభాన్ని కూడా పొంద‌వ‌చ్చు.
 
2020 డిసెంబర్ 28 నుంచి 2021 జనవరి 1 వరకు జారీచేసిన‌ బాండ్ల (సిరీస్ IX) ఇష్యూ ధర గ్రాము బంగారానికి రూ. 5,000. ఈ సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌ను భారత ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ జారీ చేస్తుంది.


2019, 2020 సంవత్సరాల్లో బంగారం గ‌ణ‌నీయ‌మైన‌ లాభాలను సాధించింది,  రెండంకెల వృద్ధిని న‌మోదుచేసింది. గత ఏడాది ఆగస్టులో బంగారం 10 గ్రాములకు రూ.56,200 వ‌ద్ద‌కు చేరింది. కొంతకాలంగా రూ. 48,000-52000 పరిధిలో ట్రేడవుతోంది.
  అయితే అమెరికా డాల‌ర్‌ బలోపేతం, అధిక బాండ్ల దిగుబడి కారణంగా  అంతర్జాతీయ పెట్టుబడిదారులకు బంగారాన్ని ఖరీదైనదిగా మారింది.

  అమెరికాలో పాలన మార్పులు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, క‌రోనా టీకా ప్రక్రియ సమర్థత బంగారం ధరలకు మార్గనిర్దేశం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని