ఈక్విటీలలో పెట్టుబడులకు ముందు తెలుసుకోవాల్సిన అంశాలు
మీ కుటుంబానికి ఆర్థిక భద్రతనిచ్చే విధంగా బీమా పాలసీ ఉండాలని గుర్తుంచుకోండి....
మీ కుటుంబానికి ఆర్థిక భద్రతనిచ్చే విధంగా బీమా పాలసీ ఉండాలని గుర్తుంచుకోండి
మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు, ఆర్థిక సలహాదారులు హెచ్చరించినప్పటికీ ఇప్పుడు యువ పెట్టుబడుదారులు ఎక్కువ రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు కూడా సిద్థంగా ఉన్నారు. వారికి కావాల్సింది మార్కెట్ల పరిస్థితులకు అనుకూలంగా రాబడినిచ్చే సరైన మ్యూచువల్ ఫండ్లు. అయితే ఈక్విటీ పెట్టుబడులు చేసేముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
పరిస్థితులను అంచనా వేయండి:
మీ బ్యాంకు డిపాజిట్లో రూ.50,000 ఉన్నాయనుకుందాం. మార్కెట్లు నష్టపోతున్న సమయంలో ఈక్విటీలలో పెట్టుబడులకు మంచి సమయం. అయితే మరో పదేళ్ల వరకు ఆ డబ్బు మీకు అవసరం లేదనుకుంటేనే ఈ నిర్ణయం తీసకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురవుతుందో చెప్పలేం. ఇప్పుడు అనుకోకుండా వచ్చిన కరోనా కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం లేదా వేతనాల్లో కోత విధించడం చూస్తున్నాం. ఏదైనా అనారోగ్య సమస్య ఎదురుకావొచ్చు. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టగలం అనే నమ్మకం ఉంటేనే ఈక్వీటీలవైపు అడుగేయండి.
బీమా హామీ ముఖ్యం :
మీకు, మీ కుటుంబానికి ఆర్థిక భద్రతనిచ్చే విధంగా బీమా పాలసీ ఉండాలని గుర్తుంచుకోండి. ఆసుపత్రి ఖర్చులకు, అత్యవసర వైద్య చికిత్సలకు సరిపడేలా కవరేజ్ ఉండటం మఖ్యం. కనీసం రూ.10 లక్షల హామీ కలిగిన ఆరోగ్య బీమా పాలసీ తీసకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నవారిని రూ.25 లక్షల వరకు కూడా తీసుకోవాల్సిందిగా ఆర్థిక నిపుణుల సలహా.
అత్యవసర నిధి:
కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడినంత మొత్తం అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని నిపుణుల సూచన. అయితే ఇలాంటి కరోనా వంటి పరిస్థితులలో అది కూడా సరిపోకపోవచ్చు. వీలైతే ఏడాది వరకు సరిపడినంత అత్యవసర నిధిని ఏర్పాటు చేకరసుకోండి. ఎందుకంటే ఆర్థికంగా మీపై ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రులకు ఎలాంటి పరిస్థితులోనైనా ఇబ్బంది రాకుండా చూసుకోవాలంటే ఇది తప్పనిసరి.
సహనం అవసరం:
చరిత్రలో చూస్తే మార్కెట్లు పడిన ప్రతీసారి అంతకంటే రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి. కానీ, ప్రతీసారి అలాగే జరుగుతుందని అంచనా వేయలేం. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి వెంటనే లాభాన్ని ఆశించడం సరికాదు. దేనికైనా ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలి.
బావోద్వేగాలు పనికిరావు:
మార్కెట్లలో పెట్టుబడులు పెడితే నష్టపోయినప్పుడు మొత్తం కోల్పోయినట్లు భావించడం సరికాదు. ఈక్విటీ పెట్టుబడుల ప్రయోజనం కోసం దీర్ఘకాలం వేచిచూడాల్సి ఉంటుంది. మార్కెట్లలో ఎన్ని ఒడుదొడుకులు వచ్చిన తట్టుకొని నిలబడాలి. సరైన ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్, కేటాయింపులు, పొదుపులు వంటివి సక్రమంగా ఉంటే మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!