మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవీ అంటే!!
మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేటప్పుడు ఎన్ఏవీని లెక్కించే పద్ధతి, ఎన్ఏవీ విలువను ప్రభావితం చేసే అంశాలను తెలుసుకుందాం...
మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేటప్పుడు ఎన్ఏవీని లెక్కించే పద్ధతి, ఎన్ఏవీ విలువను ప్రభావితం చేసే అంశాలను తెలుసుకుందాం...
మ్యూచువల్ ఫండ్లోని మన పెట్టుబడుల లాభ నష్టాలు ఆ ఫండ్ ఎన్ఏవీ కదలికల మీద ఆధారపది ఉంటుంది. మరి ఎన్ఏవీ అంటే ఏమిటి అది లెక్కించే పద్దతి గురించి అవగాహన ఉండడం ఎంతైనా అవసరం.
ఎన్ఏవీ లెక్కించేందుకు సూత్రము:
పథకంలోని ఆస్తుల (అసెట్స్) మార్కెట్ విలువ − అప్పులు (లయబిలిటీస్) = ఎన్ఏవీ
ప్రతి యూనిట్ ఎన్ఏవీ విలువ తెలుసుకోవాలంటే మొత్తం అసెట్ విలువను మొత్తం యూనిట్ల సంఖ్యతో భాగించాలి.
ఉదాహరణకు :
ఒక మ్యూచువల్ ఫండ్ పధకంలో ఆస్తులు రూ.50కోట్లు, అప్పులు రూ.25కోట్లు ఉంటే ఆ ఫండ్ ఎన్ఏవీ విలువ ఇలా ఉంటుంది.
అసెట్స్ − లయబిలిటీస్ = ఎన్ఏవీ
రూ.50కోట్లు − రూ.25కోట్లు = 25కోట్లు = ఎన్ఏవీ
మ్యూచువల్ ఫండ్స్లో 1 కోటి యూనిట్లు ఉంటే, ఒక్కో యూనిట్ ఎన్ఏవీ విలువ
మొత్తం ఎన్ఏవీ రూ.25,00,00,000 / మొత్తం యూనిట్లు 1,00,00,000
ప్రతి యూనిట్ ఎన్ఏవీ = రూ.25 గా ఉంటుంది
ఎన్ఏవీలో మార్పులు:
పెట్టుబడి సాధనాల ధరల్లో మార్పులేమైనా చోటుచేసుకుంటే మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవీలలోనూ మార్పులు ఉండొచ్చు.
ఎన్ఏవీని ప్రభావితం చేసే అంశాలు
- ఫండ్ లోని పెట్టుబడుల లో మార్పులు చేర్పులు
- ఫండ్ ఆస్తుల విలువలో మార్పులు
- ఫండ్ నిర్వహణ ఖర్చులు, చెల్లింపులు
- యూనిట్ల కొనుగోలు, అమ్మకాలు
మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు తమ నికర ఆదాయ విలువ నెట్ అసెట్ వాల్యూ, ఎన్ఏవీలను రోజువారీగా తప్పకుండా ప్రచురించాలి. ఏమ్ఎఫ్ఐ వెబ్సైట్లో రాత్రి 9గంటల లోగా ఫండ్ యూనిట్ల ఎన్ఏవీ, అమ్మకం/కొనుగోలు ధరలను అప్డేట్ చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!