WhatsApp Payments: మరో 2 కోట్ల మందికి వాట్సాప్ పేమెంట్స్!
మరో రెండు కోట్ల మందికి తమ పేమెంట్స్ ఫీచర్ను అందించేందుకు నియంత్రణా సంస్థలు అనుమతించినట్లు వాట్సాప్ వర్గాలు తెలిపాయి....
దిల్లీ: మరో రెండు కోట్ల మందికి తమ పేమెంట్స్ ఫీచర్ను అందించేందుకు నియంత్రణా సంస్థలు అనుమతించినట్లు వాట్సాప్ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రస్తుతం రెండు కోట్ల మంది వినియోగిస్తున్న వాట్సాప్ పేమెంట్స్.. ఇకపై నాలుగు కోట్ల మందికి చేరువ కానుందని వెల్లడించాయి. దీనిపై వాట్సాప్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే, ఈ ఫీచర్ను వినియోగించే వారి సంఖ్యపై పరిమితి విధించడంపై వాట్సాప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నిరంతరాయ సేవలను అందించేందుకు ఎలాంటి పరిమితి లేకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్లో 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..