Auto news: పెట్రో బాదుడు నుంచి విముక్తి ఇలా..
పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టడంతో మధ్యతరగతి జీవి జేబుకు భారీ చిల్లుపడింది. డీజిల్ కారుతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తుంది.. ఇంజిన్ చప్పుడు ఉండదు..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టడంతో మధ్య తరగతి జీవి జేబుకు భారీ చిల్లుపడింది. డీజిల్ కారుతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తుంది.. ఇంజిన్ చప్పుడు ఉండదు.. ఎప్పుడో ఒక సారి బయటకు వెళ్లొచ్చులే అని పెట్రోల్ కార్లు కొనుక్కున్న వారు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. సహజంగానే డీజిల్తో పోలిస్తే పెట్రోల్ కార్ల మైలేజీ తక్కువే. దీనికి తోడు పెట్రోల్ ధరలు రూ.100 దాటేయడంతో నిర్వహణ ఖర్చు తడిసిమోపెడైంది. నగరాల్లోని ట్రాఫిక్లో బంపర్ టూ బంపర్ డ్రైవింగ్ దెబ్బకు మైలేజీ ఘోరంగా తగ్గిపోతుంది. మైలేజీ సాధించే చిట్కాలను ట్రాఫిక్లో పాటించడం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో సీఎన్జీ కారు అద్భుతమైన ప్రత్యామ్నాయం.
పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.104 వద్ద ఉంది. అదే కిలో సీఎన్జీ ధర రూ.69. ఇది పెట్రోల్ కంటే ఎక్కువ మైలేజీ కూడా ఇస్తుంది. ఉదాహరణకు ఆల్టో కారును తీసుకొంటే లీటర్ పెట్రోల్కు 22.05 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అదే సీఎన్జీ కారు మైలేజీ కేజీకి 31.59కి.మి.గా పేర్కొంది. మైలేజీలో అదనంగా తొమ్మిది కిలోమీటర్లు లభిస్తుండగా.. ధరలో 35 రూపాయలు మిగులుతున్నాయి. నెలకు 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించే వారికి సీఎన్జీతో ఖర్చు బాగా ఆదా అవుతుంది. దీనికి తోడు సీఎన్జీకి రోజువారీ ధరలు నిర్ణయించే విధానం లేదు. ఏడాది మొత్తం మీద ఐదు లేదా ఆరు సార్లు మారతాయి.
* పెట్రోల్,డీజిల్ వలే ఇది పర్యావరణానికి హాని చేయదు. వాహనాల్లో సీఎన్జీ వినియోగం వల్ల కార్బన్ మోనాక్సైడ్ వంటి ఉద్గారాలను 80శాతం వరకు తగ్గించవచ్చని సర్వేలు చెబుతున్నాయి. మిగిలిన ఉద్గారాలను సీఎన్జీ 45శాతం తగ్గిస్తుంది. సీఎన్జీ కారును పెట్రోల్, సీఎన్జీలతో నడిపించ వచ్చు. ఒక వేళ సీఎన్జీ బంకులు అందుబాటులో లేకపోతే పెట్రోల్ వాడుకొని ప్రయాణించవచ్చు.
* సీఎన్జీ ఇంజిన్ వాడితే ఇంధన అవశేషాలు చాలా తక్కువగా వెలువడుతాయి. దీంతో కారు ఇంజిన్లోని పైపులు, ట్యూబులు వెంటనే దెబ్బతినే ప్రమాదం ఉండదు. ఫలితంగా ఇంజిన్ జీవితకాలం పెరుగుతుంది. దీంతో తరచూ సర్వీసింగ్లు చేయించాల్సిన సమస్య తగ్గుతుంది. ఇంధన లీకేజీ జరిగితే పెట్రోల్, డీజిల్ మాదిరిగా మిగిలిన భాగాలకు వ్యాపించి ప్రమాదకారిగా మారదు. గాలి కంటే సీఎన్జీ తేలిగ్గా ఉండటంతో తొందరగా వాహనం బయటకు వెళ్లిపోతుంది.
సీఎన్జీలో చిన్న చిన్న లోపాలు..
* సీఎన్జీ 12 కేజీల సిలిండర్లో 85శాతం మాత్రమే నింపవచ్చు.
* కారు పికప్ కొంత తగ్గే అవకాశం ఉంది.
* డిక్కీలో సిలిండర్ను అమర్చితే ఆమేరకు స్థలం అందుబాటులో ఉండదు.
* సీఎన్జీ స్టేషన్లు తగినన్ని లేకపోవడం.
* సీఎన్జీ కోసం బ్రాండెడ్ కిట్ వాడకపోతే సమస్యలు రావడం.
భారత్లో చౌకగా లభించే 5 సీఎన్జీ కార్లు..
మారుతీ సుజుకీ ఆల్టో: భారత్లో అత్యధికంగా అమ్ముడుపోయే మోడల్ ఇది. ఈ చిన్న ఎంట్రీ లెవల్ కారులో 0.8 లీటర్ ఇంజిన్ ఉంది. ఇది సీఎన్జీ ఇంధనంతో 40 బీహెచ్పీ శక్తిని, 60 ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది. ఇక కేజీ సీఎన్జీకి 31.59 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఎల్ఎక్స్ఐ,ఎల్ఎక్స్ఐ(ఓ) వేరియంట్లలో లభించే ఈ కారు ఎక్స్షోరూమ్ ధర రూ.4.56 లక్షల నుంచి రూ.4.60 లక్షల వరకు ఉంది.
మారుతీ సుజుకీ సెలీరియో: ఆల్టోతో పోలిస్తే కొంచెం పెద్దగా ఉంటుంది. పలు ఫీచర్లు దీనిలో అందుబాటులో ఉన్నాయి. దీనిలోని 1.0 లీటర్ ఇంజిన్ 57 బీహెచ్పీ శక్తి, 78 ఎన్ఎం టార్క్ని విడుదల చేస్తుంది. ఇది కేజీ సీఎన్జీకి 30.47 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. సీఎన్జీ వెర్షన్ వీఎక్స్ఐ, వీఎక్స్ఐ (ఓ) వేరియంట్లలో లభిస్తుంది. వీటి ఎక్స్షోరూమ్ ధర రూ.5.85 లక్షల నుంచి రూ.5.90 లక్షల వరకు ఉంది.
మారుతీ సుజుకీ వేగనార్ : టాల్బాయ్ సిట్టింగ్ డిజైన్లో లభించే ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలోని 1.0లీటర్ 3సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 57 బీహెచ్పీ శక్తి, 78 ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది. కేజీ సీఎన్జీకి 32.52 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అత్యధిక మైలేజీ ఇచ్చే సీఎన్జీ కారుగా ఇది ఘనత సాధించింది. ఎల్ఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ(ఓ) మోడళ్లలో ఇది లభిస్తుంది. దీని ధర రూ.5.60 లక్షల నుంచి రూ.5.67 లక్షల వరకు ఉంది.
హ్యూందాయ్ సాంత్రో: ఈ కారులోని మాగ్నా, స్పోర్ట్స్ వేరియంట్లుకు1.2లీటర్ ఫోర్సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 60 బీహెచ్పీ శక్తి, 85 ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది. అత్యధికంగా కేజీ సీఎన్జీకి 30.38 కిలోమీటర్ల మైలేజీ లభిస్తుంది. దీని ధర రూ.5.92 లక్షల నుంచి రూ.6.06 లక్షల మధ్య ఉంటుంది.
హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: ఈ కారు 1.2లీటర్ ఇంజిన్తో వస్తుంది. ఇది 69బీహెచ్పీ శక్తి, 95 ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది. ఇది కేజీ సీఎన్జీకి 28.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక ధర రూ.6.84 లక్షల నుంచి రూ.7.38 లక్షల వరకు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన