నగదు ద్వారా చెల్లింపులకే మహిళల ప్రాధాన్యం
మహిళల్లో ఇప్పటికీ చాలా మంది నగదు రూపేణానే చెల్లింపులు చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఆధార్ పే, యూపీఐ క్యూఆర్ కోడ్లు, డెబిట్/ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్న మహిళల సంఖ్య చాలా తక్కువగానే ఉందని పేర్కొంది. చెల్లింపుల లావాదేవీల విషయంలో
పేనియర్బై సర్వే
దిల్లీ: మహిళల్లో ఇప్పటికీ చాలా మంది నగదు రూపేణానే చెల్లింపులు చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఆధార్ పే, యూపీఐ క్యూఆర్ కోడ్లు, డెబిట్/ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్న మహిళల సంఖ్య చాలా తక్కువగానే ఉందని పేర్కొంది. చెల్లింపుల లావాదేవీల విషయంలో మహిళల ధోరణి ఎలా ఉందో తెలుసుకునేందుకు 3,500 విక్రయ కేంద్రాల్లో ఆర్థిక సాంకేతిక సేవల సంస్థ పేనియర్బై ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో 65 శాతానికి పైగా మహిళలు ఇప్పటికీ నగదు చెల్లింపులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. ఆధార్ పే, యూపీఐ, డెబిట్ కార్డు రూపేణా చెల్లింపులు చేస్తున్న వాళ్ల సంఖ్య 5-15 శాతం మధ్య ఉంటోందని పేర్కొంది. రిటైల్ కేంద్రాల్లోని టచ్ పాయింట్ల వద్ద మహిళలు వినియోగించుకుంటున్న సేవల్లో నగదు ఉపసంహరణ, మొబైల్ రీఛార్జ్లు, బిల్లుల చెల్లింపులు ప్రాధాన్యమైనవని వెల్లడించింది. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు ఇలా..
* పట్టణ, మెట్రో నగరాల్లో నగదును ఉపసంహరించుకుంటున్న మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. 31 నుంచి 40 మధ్య వయసున్న మహిళా ఉద్యోగుల్లో 45 శాతం మంది, 20-30 మధ్య వయసున్న మహిళా ఉద్యోగుల్లో 25 శాతం మంది నగదు ఉపసంహరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
* తృతీయ శ్రేణి నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో 78 శాతం మంది మహిళలు నగదు ఉపసంహరణకు మొగ్గు చూపుతున్నారు.
* దేశవ్యాప్తంగా మహిళలు ఎక్కువగా రూ.1000-2500 మధ్య నగదును ఉపసంహరించుకుంటున్నారు.
* సొంతంగా బ్యాంకు ఖాతాను నిర్వహిస్తున్న మహిళల సంఖ్య 76 శాతానికి పైగా ఉంటోంది. తమ ఖాతాలను భర్తలు నిర్వహిస్తున్నారని 20 శాతం మంది మహిళలు వెల్లడించారు.
* నెలకు మహిళల చిన్న మొత్తాల పొదుపు రూ.500- 750 మధ్య ఉంటోంది. పిల్లల చదువు కోసమే ఎక్కువ మంది డబ్బును పొదుపు చేస్తున్నట్లు తేలింది.
* బీమా పథకాలపై 5 శాతం మందికి మాత్రమే అవగాహన ఉంది. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లో దీని ఆవశ్యకత ఎక్కువగా ఉందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్