Credit Card: క్రెడిట్, డెబిట్ కార్డులను లాక్ చేయొచ్చు తెలుసా!
మీ కార్డును ఒక నిర్దిష్ట పరిమితికి లాక్ చేయడం వల్ల అదనపు రక్షణ కల్పించడంతో పాటు, ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డుల ఉపయోగంతో పరిమితికి మించి ఖర్చు చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈ ఖర్చులను అదుపులో పెట్టుకోవడానికి మీ క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలపై పరిమితిని మీరే సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు కార్డు ఉపయోగించిన ప్రతిసారీ రూ.5 వేలు లేదా రూ.10 వేలు మించి లావాదేవీలు చేయకూడదు అనుకుంటే, దానికి తగినట్లగా పరిమితిని ఏర్పాటు చేసుకోవచ్చు. అంతకు మించి చేసే లావాదేవీలు విఫలమవుతాయి. అంతర్జాతీయ లావాదేవీలను నియంత్రించుకునే అవకాశం కూడా ఉంది.
ఎలా సెట్ చేయాలి?
కార్డు పరిమితిని ఏర్పరుచుకునే విధానం బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు కార్డుపై ఉన్న బటన్ను స్విచ్ ఆన్ చేయడం ద్వారా అనుమతిస్తే, చాలా బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా పరిమితిని ఏర్పాటు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మీరు కార్డు ఆప్షన్కు వెళ్లి పరిమితి విధించాలనుకుంటున్న కార్డు వివరాలను నమోదు చేయాలి. దేశీయ లావాదేవీల కోసం లేదా అంతర్జాతీయ లావాదేవీల కోసం పరిమితి ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? లేదా ఇతర మార్పులు ఏమైనా చేయాలనుకుంటున్నారా? అన్న ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకుని లిమిట్ను సెట్ చేసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా లిమిట్ను సెట్ చేసుకునే సౌకర్యాన్ని కొన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. ఒకసారి ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత బ్యాంకు పరిమితి విధించిన సంగతి మీకు తెలియజేస్తుంది. తదుపరి లావాదేవీలు పరిమితికి మించితే బ్యాంకు మీకు సమాచారం ఇస్తుంది.
పరిమితి ఎందుకు పెట్టుకోవాలి?
డెబిట్, క్రెడిట్ కార్డుల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు బ్యాంకులతో పాటు మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి మీ పాస్వర్డ్, పిన్ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోకండి. మీ కార్డు విత్డ్రా లిమిట్ను పరిమితం చేయండి. ఉదాహరణకు మీ కార్డు అంతర్జాతీయ లావాదేవీలను రద్దు చేసి, దేశీయంగా ఒకసారి చేసే లావాదేవీలను రూ.5 వేలకు పరిమితం చేశారనుకుందాం. అంతర్జాతీయంగా మోసాలకు పాల్పడే వారు మీ కార్డు వివరాల ద్వారా లావాదేవీలు నిర్వహించలేరు. అలాగే దేశీయంగా మోసాలకు పాల్పడితే రూ.5 వేలకు మించి నష్టపోకుండా జాగ్రత్తపడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు