Zomato Listing: తొలిరోజే దూసుకుపోతున్న జొమాటో షేర్లు!
నేడు తొలిసారి స్టాక్ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన జొమాటో లిమిటెడ్ షేర్లు అందరూ ఊహించినట్లుగానే శుభారంభం చేశాయి. షేరు ధర బీఎస్ఈలో 115 వద్ద ప్రారంభమైంది. ఐపీఓ ధర రూ.76తో పోలిస్తే 51.32 శాతం ప్రీమియంతో నమోదైంది.....
ముంబయి: నేడు తొలిసారి స్టాక్ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన జొమాటో లిమిటెడ్ షేర్లు అందరూ ఊహించినట్లుగానే శుభారంభం చేశాయి. షేరు ధర బీఎస్ఈలో రూ.115 వద్ద ప్రారంభమైంది. ఐపీఓ ధర రూ.76తో పోలిస్తే 51.32 శాతం ప్రీమియంతో నమోదైంది. అదే సమయంలో ఎన్ఎస్ఈలో 53 శాతం ప్రీమియంతో రూ.116 వద్ద లిస్టయ్యింది. ప్రారంభంలోనే బీఎస్ఈలో 42 లక్షల షేర్లు చేతులు మారడం విశేషం. ఇక ఎన్ఎస్ఈలో 19.41 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఉదయం 10:17 గంటల సమయంలో బీఎస్ఈలో జొమాటో షేరు ధర 72 శాతం ఎగబాకి 131 వద్ద ట్రేడవుతోంది. ఓ దశలో రూ.138 వరకు ఎగబాకి అప్పర్ సర్క్యూట్ను తాకింది. ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,08,067.35 కోట్లను దాటింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా బీఎస్ఈలో టాప్ 50 జాబితాలో జొమాటో చేరింది. అనేక ఫిన్టెక్ అంకుర సంస్థలు ఐపీఓకి వెళ్లేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ తరుణంలో జొమాటోకు ఆదరణ లభిస్తే వాటన్నింటికీ బూస్టింగ్ లభించనుంది.
వాస్తవానికి జొమాటో షేర్లు 27న (మంగళవారం) నమోదు కావాల్సి ఉండగా.. 2 పనిదినాల ముందుకు జరపడం గమనార్హం. ఇందుకోసం షేర్ల కేటాయింపు ప్రక్రియను సంస్థ గురువారమే పూర్తి చేసింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరును రూ.75 ప్రీమియంతో రూ.76 చొప్పున కంపెనీ కేటాయించింది. గత శుక్రవారం (16న) ముగిసిన జొమాటో ఐపీఓకు 40.38 రెట్ల స్పందన లభించింది. 2020 మార్చి తర్వాత (ఎస్బీఐ కార్డ్స్- రూ.10,341 కోట్లు) అధిక నిధులు సమీకరించిన ఐపీఓ ఇదే. దాఖలైన బిడ్ల విలువ రూ.2.13 లక్షల కోట్లు కాగా, 11 ఏళ్ల మార్కెట్ చరిత్రలోనే ఇది అధికమని చెబుతున్నారు.
లిస్టింగ్కి కొన్ని నిమిషాల ముందు జొమాటో వ్యవస్థాపకుడు వాటాదార్లకు లేఖ రాశారు. సంస్థ భవిష్యత్తు మనుగడపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. జొమాటోతో పాటు మరో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ప్రపంచస్థాయి సంస్థలుగా ఎదగనున్నాయని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశ వృద్ధిపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. భారత్ వంటి క్లిష్టమైన మార్కెట్లలో నిరూపించుకుంటే తిరుగే ఉండదని అభిప్రాయపడ్డారు. గత పదేళ్ల ప్రయాణంలో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్నామన్నారు. రానున్న పదేళ్లు.. ఆపై దృష్టి సారించామన్నారు. స్వల్పకాల లాభాలపై దృష్టి పెట్టకుండా దీర్ఘకాల విజయం కోసం కృషి చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్