- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Aadhaar at doorstep: ఆధార్లో మార్పులా?.. పోస్ట్మ్యాన్ ద్వారా ఇంటివద్దే సేవలు!
ఇంటర్నెట్ డెస్క్: ఆధార్తో మన బంధం విడదీయరానిదిగా మారిపోయింది. ప్రతి చిన్న పనికీ ఆధార్ (Aadhar) తప్పనిసరి అయిపోయింది. అప్పుడప్పుడు ఆధార్కు సంబంధించిన పనుల కోసం ఆయా సేవా కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరగడమూ అలవాటైపోయింది. దీంతో ఆధార్కు సంబంధించిన పనులంటేనే కొందరు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో ఆధార్ సేవలను సులభతరం చేసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.
ఇంటివద్దే ఆధార్ సేవలను అందించేందుకు వీలుగా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్కు చెందిన 48 వేల మంది పోస్ట్మ్యాన్లకు శిక్షణ ఇస్తోంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు ఈ సేవలు అందించే ఉద్దేశంతో వీరికి తర్ఫీదు ఇస్తోంది. ఆధార్తో మొబైల్ నంబర్ అనుసంధానం, వివరాలు అప్డేట్ చేయడం, చిన్నారుల ఆధార్ వివరాలు నమోదు చేయడం వీరి విధి. తదుపరి విడతలో మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు ఉడాయ్ సిద్ధమవుతోందని సీనియర్ అధికారులు పేర్కొన్నారు.
శిక్షణ పొందిన పోస్ట్మ్యాన్లు ఆధార్ కిట్ కలిగిన డెస్క్టాప్, ల్యాప్టాప్ ద్వారా ఈ సేవలను అందించనున్నారు. ప్రస్తుతం మొబైల్, ట్యాబ్లెట్ సాయంతో చిన్నారుల వివరాల నమోదు ప్రక్రియను పైలట్ ప్రాజెక్ట్గా చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. త్వరలో ఈ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించనున్నట్లు ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కామన్ సర్వీస్ సెంటర్తో పనిచేస్తున్న 13 వేల మంది బ్యాంకింగ్ ప్రతినిధులను ఈ సేవలకు వినియోగించనున్నారు. ఐపీపీబీ పోస్ట్మ్యాన్లు సేకరించిన వివరాలను త్వరితగతిన వీరు అప్డేట్ చేయనున్నారు. దీంతో పాటు దేశంలో ఒక్కో జిల్లాకు ఒక్కో ఆధార్ సేవా కేంద్రం చొప్పున 755 చోట్ల త్వరలో తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉడాయ్ అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Indian Army: సియాచిన్లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
-
World News
Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
-
Movies News
NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
-
Sports News
T20 Cricket : టీ20ల్లో టాప్ స్కోరర్.. మళ్లీ రోహిత్ను అధిగమించిన కివీస్ ఓపెనర్
-
India News
Mukesh Ambani: ముకేశ్ అంబానీకి బెదిరింపులు.. రెండు గంటల్లో 8ఫోన్ కాల్స్!
-
Crime News
Crime News: బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Flight: గర్ల్ఫ్రెండ్తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Indraja: నాకు అమ్మాయి పుట్టేదాకా.. పెళ్లి విషయం ఎవరికీ తెలియదు: ఇంద్రజ
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Tirumala: 50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్ దర్శనం.. ఏపీ మంత్రిపై విమర్శలు
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్ఛైర్లో ఝున్ఝున్వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Jio Phone 5G: జియో 5జీ ఫోన్.. ధర, ఫీచర్లు, విడుదల తేదీ వివరాలివే!