Brand value: బ్రాండ్ విలువలో కోహ్లీని దాటేసిన రణ్వీర్.. టాప్-25లో అల్లు అర్జున్కు చోటు!
most valuable celebrities: బ్రాండ్ విలువ పరంగా బాలీవుడ్ నటుడు రణ్వీర్ అగ్రస్థానంలో నిలిచాడు. టాప్-25తో కూడిన జాబితాలో అల్లు అర్జున్ సైతం చోటు దక్కించుకున్నాడు.
Brand value| ముంబయి: బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) అత్యంత బ్రాండ్ విలువ (Brand value) కలిగిన సెలబ్రిటీగా అవతరించాడు. గతేడాది అగ్రస్థానంలో నిలిచిన కోహ్లీని (Virat Kohli) వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచాడు. 2022 సంవత్సరానికి గానూ ‘సెలబ్రిటీ బ్రాండ్ వాల్యేయేషన్ స్టడీ’ పేరిట కన్సల్టింగ్ సంస్థ క్రోల్ వెలువరించిన జాబితాలో 185.1 మిలియన్ డాలర్లతో రణ్వీర్ అగ్రస్థానంలో నిలిచాడు. తెలుగు నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం.
బ్రాండ్ ఎండార్స్మెంట్, ప్రపంచ వ్యాప్తంగా ఉనికి ఆధారంగా బ్రాండ్ విలువను లెక్కించి ఏటా క్రెల్ ఈ తరహా జాబితాను వెలువరిస్తుంటుంది. 20022 ఏడాది గానూ 25 మందితో తాజాగా ఈ జాబితాను వెలువరించింది. టాప్-25 సెలబ్రిటీల మొత్తం బ్రాండ్ విలువ గతేడాదితో పోలిస్తే 29.1 శాతం పెరిగి 1.6 బిలియన్లకు చేరిందని క్రెల్ పేర్కొంది. ఇక జాబితా విషయానికొస్తే.. 2020లో 237.3 మిలియన్ డాలర్లుగా ఉన్న కోహ్లీ బ్రాండ్ విలువ 2021లో 185.7 మిలియన్ల డాలర్లకు పడిపోయింది. తాజాగా ఆ మొత్తం 176.9 మిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఈ జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.
బాలీవుడ్కు చెందిన అక్షయ్ కుమార్ 158.3 మిలియన్ డాలర్లతో మూడో స్థానం దక్కించుకున్నాడు. 2021లో 181.7 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచాడు. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ 31.4 మిలియన్ డాలర్లతో 20వ స్థానంలోనూ, రష్మిక మందన్న 25.3 మిలియన్ డాలర్లతో 25వ స్థానంలో నిలిచారు.
Also Read: బన్నీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. టీజర్తో సర్ప్రైజ్ సిద్ధం చేస్తోన్న ‘పుష్ప2’టీం
- ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా టాప్-25లో తొలిసారి చోటు దక్కించుకున్నాడు. 26.5 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో పీవీ సింధుతో సమానంగా 23వ స్థానంలో నిలిచాడు.
- 2021లో 68.1 మిలియన్ డాలర్లుగా ఉన్న అలియా భట్ బ్రాండ్ విలువ 2022లో ఏకంగా 102.9 మిలియన్ డాలర్లకు చేరింది. ఓవరాల్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. దీపిక (82.9మి.డా) ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
- మాజీ క్రికెటర్లు అయిన ధోనీ 80.3 మిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో నిలవగా.. 73.6 మిలియన్ డాలర్ల విలువతో సచిన్ తెందూల్కర్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. 55.7 మిలియన్ డాలర్లతో షారుక్ పదో స్థానంలో, 54.5 మిలియన్ డాలర్లతో సల్మాన్ 11వ స్థానంలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!