Adani Group: ఆరోపణల నుంచి బయటపడేందుకు ‘అదానీ’ ఆడిట్ మార్గం!
Adani Group: షేర్ల విలువ పతనానికి అడ్డుకట్ట వేసేందుకు అదానీ గ్రూప్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేయగా.. తాజాగా కంపెనీల్లో స్వతంత్ర ఆడిట్ కోసం ఓ సంస్థను నియమించింది.
దిల్లీ: హిండెన్బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) ఆరోపణలు నుంచి బయటపడేందుకు అదానీ గ్రూప్ (Adani Group) చర్యలు చేపట్టింది. ఈ మేరకు తమ గ్రూప్ (Adani Group)లోని కొన్ని కంపెనీల స్వతంత్ర ఆడిట్ కోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థోర్టన్ (Grant Thornton)ను నియమించింది. తద్వారా పెట్టుబడిదారులు, నియంత్రణా సంస్థలకు భరోసా ఇవ్వాలని భావిస్తోంది.
తమ కంపెనీలు ఏ విషయాన్ని దాచిపెట్టలేదని ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)’ సహా నియంత్రణా సంస్థలకు చూపించడమే ఆడిట్ ప్రాథమిక లక్ష్యమని కంపెనీ వర్గాలు తెలిపాయి. అలాగే అన్ని నిబంధనలు పాటించినట్లు చూపించాలని కూడా సంస్థ భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. నిధుల దుర్వినియోగం, స్వదేశీ నిధుల దారి మళ్లింపు, రుణాలను ఇతర అవసరాలకు వినియోగించడం వంటి ఆరోపణలపై ఆడిట్ ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిపాయి.
కంపెనీ ఖాతాలు బలంగా ఉన్నాయని, ప్రాజెక్టుల అమలు నిరాటంకంగా కొనసాగుతుందని ఆడిట్ ద్వారా చూపించాలని అదానీ గ్రూప్ (Adani Group) భావిస్తున్నట్లు సమాచారం. షేర్ల విలువల పతనానికి అడ్డుకట్టవేసే యత్నాల్లో భాగంగా గ్రూప్ ఈ చర్యలు చేపడుతోంది. తమ పెట్టుబడి ప్రణాళికల విషయంలో ముందుకే వెళుతున్నట్లు.. అన్నింటికీ పూర్తి స్థాయిలో నిధులు ఉన్నట్లు సోమవారం తెలిపింది. వాటాదార్లకు తగిన ప్రతిఫలాలను ఇవ్వగలమని ధీమా వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు గ్రూప్నకు చెందిన ఏడు నమోదిత కంపెనీల మార్కెట్ విలువ సగానికి పైగా తగ్గిన సంగతి తెలిసిందే.
వృద్ధి లక్ష్యాలు, మూలధన వ్యయాల్లో కోత విధించొచ్చన్న వార్తలను అదానీ గ్రూప్ (Adani Group) కొట్టిపారేసింది. ప్రాజెక్టులు ఆలస్యం అవ్వొచ్చు కానీ.. వాయిదా పడడం లేదా విరమించుకోవడం జరగదని స్పష్టం చేసింది. సౌర విద్యుత్తు, హరిత హైడ్రోజన్, విమానాశ్రయాల విస్తరణ ప్రణాళికలు అనుకున్న సమయానికే పూర్తి అవుతాయని వివరించింది. అదానీ గ్రీన్కు తన మొత్తం రూ.22,000 కోట్ల బకాయిలను గడువు (2025 మార్చి )లోగా తీర్చే సత్తా ఉందని బెర్న్స్టీన్ రీసెర్చ్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 30 శాతం మేర పెరిగింది. -
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
Swiggy: క్విక్- కామర్స్ విభాగమైన ఇన్స్టామార్ట్ను స్విగ్గీ మాల్తో అనుసంధానం చేసినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ గురువారం తెలిపింది. -
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
బేబీ ఫుడ్స్లో చక్కెర అధిక స్థాయిలో వినియోగిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై నెస్లే ఇండియా వివరణ ఇచ్చింది. -
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో సాయంత్రానికి నష్టాల్లోకి జారుకున్నాయి. -
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
Cab Services: అదనంగా డబ్బులు వసూలు చేసినందుకుగాను ఉబర్ ఇండియాకు కన్జ్యూమర్ కమిషన్ రూ.28 వేలు జరిమానా విధించింది. -
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
Air India Express: తొలిసారి ఓటు వేయబోయే వారిని దృష్టిలో ఉంచుకొని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. అదేంటో చూద్దాం.. -
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
Best Airports: స్కైట్రాక్స్ ఏటా ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను విడుదల చేస్తుంటుంది. వీటిలో తొలి 20 స్థానాల్లో ఏవి నిలిచాయి? భారత్లోని ఎయిర్పోర్టుల పరిస్థితి ఏంటో చూద్దాం.. -
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి