Adani FPO: మెగా ఎఫ్పీఓకు ‘అదానీ’ సన్నాహాలు!
Adani FPO: వాటాదారుల సంఖ్యను పెంచుకోవడం కోసం అదానీ గ్రూప్ ఎఫ్పీఓకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దాదాపు రూ.20,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
దిల్లీ: అదానీ ఎంటర్ప్రైజెస్ త్వరలో మలి విడత పబ్లిక్ ఇష్యూ (FPO-ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్)కు వచ్చేందుకు సమాయత్తమవుతోంది. దాదాపు రూ.20,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి ఆమోదం తెలిపేందుకు కంపెనీ బోర్డు శుక్రవారం భేటీ కానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ దీనికి ఆమోదం లభిస్తే.. దేశంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఎఫ్పీఓగా రికార్డు సృష్టిస్తుంది. 2020లో యెస్ బ్యాంక్ సమీకరించిన రూ.15,000 కోట్లే ఇప్పటి వరకు అతిపెద్ద ఎఫ్పీఓగా ఉంది.
ప్రైమ్ డేటాబేస్ వివరాల ప్రకారం.. దేశంలో తొలి తొమ్మిది అతిపెద్ద ఎఫ్పీఓల జాబితాలో బ్యాంకింగ్, ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే ఉన్నాయి. బాబా రామ్దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్కు చెందిన రుచి సోయా ఈ ఏడాదిలోనే ఎఫ్పీఓ ద్వారా రూ.4,300 కోట్లు సమీకరించింది. ఇది పదో అతిపెద్ద ఎఫ్పీఓ. స్టాక్ మార్కెట్ నమోదిత కంపెనీలు సాధారణంగా ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ద్వారా నిధుల్ని సమీకరిస్తుంటాయి. ఎఫ్పీఓలతో పోలిస్తే ఇది చాలా సులభమైన మార్గం. అలాగే వేగంగానూ పూర్తవుతుంది. అదే ఎఫ్పీఓలో సెబీకి దరఖాస్తు చేసుకోవడం, తనిఖీ, అనుమతులు పేరిట దాదాపు మూడు నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయినప్పటికీ అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓవైపే మొగ్గుచూపడానికి కారణం ఉందని పలువురు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. వాటాదారులను పెంచుకోవడంలో భాగంగానే అదానీ గ్రూప్ ఈ మార్గం ఎంచుకుందని తెలిపారు. కంపెనీ వాటాలు కేంద్రీకృతమై ఉన్నాయన్న విమర్శలు తమపై ఉన్నాయని.. దానికి త్వరలోనే పరిష్కారం చూపబోతున్నామని ఇటీవల కంపెనీ ఓ సందర్భంలో పేర్కొనడం గమనార్హం. తాజాగా ఎఫ్పీఓ వల్ల రిటైల్ మదుపర్లకు వాటా లభిస్తుంది. అదే ప్రైవేట్ ప్లేస్మెంట్కు వెళితే మళ్లీ సంస్థాగత మదుపర్ల వాటాలే పెరిగే అవకాశం ఉంది.
2022 సెప్టెంబరు నాటికి అదానీ ఎంటర్ప్రైజెస్లో అదానీ గ్రూప్ వాటా 72.63 శాతం. ఎల్ఐసీ, ఎలారా, ఎల్టీఎస్ ఇన్వెస్ట్మెంట్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్, వెస్పెరా ఫండ్ సహా మరికొన్ని సంస్థలకు కలిపి 15 శాతం వాటాలున్నాయి. కేవలం 2.22 శాతం వాటాలు మాత్రమే వ్యక్తిగత మదుపర్ల వద్ద ఉన్నాయి. తాజా ఎఫ్పీఓ ద్వారా ఈ వాటాదారుల సంఖ్య పెరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!